కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ కనిపెట్టిన రహస్య కెమెరా కేసులో గోవా పోలీసులు ఫ్యాబ్ ఇండియా అత్యున్నత స్థాయి అధికారులకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 3న గుడ్ ఫ్రైడే రోజున సెలవుపై భర్తతో కలసి గోవాలోని కండోలిమ్ ప్రాంతంలో గల ఫ్యాబ్ ఇండియా షాపింగ్ మాల్ లోకి వెళ్లిన కేంద్ర మంత్రి స్మృతి ఇరాని.. రహస్య కెమెరాను కనిపెట్టి.. దానిపై పోలీసులకు పిర్యాదు చేసిన కేనును పార్టీ నేతలే కావాలని చల్లార్చారన్న విమర్శలపై గోవా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కేసు దర్యాప్తులో వేగాన్ని పెంచారు.
ఈ కేసుకు సంబంధించి ఫాబ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సుబ్రతా దత్తా, మేనేజింగ్ డైరెక్టర్ విలియమ్ బిసెల్లీలకు సమన్లు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి వారు అందుబాటులో వుండాలని పేర్కోంటూ పోలీసులు అతున్నత స్థాయి అధికారులకు సమన్లు జారీ చేశారు. కేంద్ర మంత్రితో పాటు ఈ చేనేత వస్త్రాలయంలో ఇలాంటి ఘటనలే ఎదుర్కోన పలువురు బాధితులను కూడా పోలీసులు పిలచి వారి వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు. అయితే ఈ కేసులో నిందితులుగా అరెస్టయిన నలుగురు ఉద్యోగులకు స్థానిక న్యాయస్థానం మరుసటి రోజున బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరితో పాటు మరో ఐదుగురు ఉధ్యోగులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు.
ఇదిలావుండగా, గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్.. ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యాలు చేశారు. ట్రయల్ రూంలో రహస్య కెమెరాల వ్యవహారంలో ఫ్యాబ్ ఇండియా సంస్థకు అనుకూలంగా మాట్లాడారు. ఇందులో ఆ సంస్థ తప్పేమీ లేదన్నారు. దేశంలోని ప్రఖ్యాత బొటిక్లలో ఫ్యాబ్ ఇండియా ఒకటని, ఉద్యోగి దుర్మార్గుడైనంత మాత్రాన సంస్థ మొత్తాన్ని నిందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 'సాక్షాత్తు కేంద్ర మంత్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు ప్రాధాన్యం లభించింది. ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గోవాలో మహిళలకు పూర్తి రక్షణ ఉంది. అని పర్సేకర్ అన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more