ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం గురించి అందరికి తెలుసు. చిలికిచిలికి గాలి వానలా అంతకంతకూ పెరిగిన ఆప్ వివాదం చివరకు పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వారిని, మేధావులను దూరం చేసుకుంది. పార్టీలో కేవలం ఒకరి మాట మాత్రమే చెల్లుబాటు అవుతోందని, పార్టీ సిద్దాంతాలకు విరుద్దంగా పని చేస్తున్నారంటూ కేజ్రీవాల్ పై ఆరోపణలు వచ్చాయి. అయితే పార్టీ నుండి కొంత మందిని సాగనంపుతూ నిర్ణయం తీసుకోగా, మిగతా వారు పార్టీలో జరుగుతున్న పరిణామాలతో విసిగి బయటకు వెళ్లారు. అయితే పార్టీలో జరిగిన ఘటనలు, కేజ్రీవాల్ ప్రవర్తన గురించి పార్టీ సినియర్ నాయకుడు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రశాంత్ భూషణ్ బహిరంగ లేఖ రాశారు. అందులో కేజ్రీవాల్ వైఖరిని ఎండగట్టారు ప్రశాంత్ భూషణ్.
ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన తరువాత ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తరువాత ప్రశాంత్ భూషణ్ దాని గురించి హెచ్చరించినట్లు లేఖ లో వెల్లడించారు. అయితే పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న తనపై, యోగేంద్ర యాదవ్ ల వాదన కూడా వినకుండానే తొలగించడం పై ఏం వివరణ ఇచ్చుకుంటారని ప్రశాంత్ భూషన్ ప్రశ్నించారు. పార్టీలో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో ఏకంగా బౌన్సర్ లను తీసుకువచ్చారని ఆరోపించారు. అంతేకాక ఎమ్మెల్యేలు కూడా కాస్త ఎక్కువగానే స్పందించారని అన్నారు. అంతేకాకుండా పార్టీ మీటింగ్ లో తమకు మాట్లాడే అవకాశం లేకుండా చేసి, చర్చలేకుండానే తమపై వేటు వేశారని ప్రశాంత్ భూషన్ ఆరోపించారు. మీటింగ్ లో కేజ్రీవాల్ ప్రసంగంలో కొంత భాగాన్ని మాత్రమే ప్రసారం చేశారని, మిగిలిన ప్రసంగాన్ని ఎంతో నేర్పుగా ప్రసారం చెయ్యలేదని అన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో ఢిల్లీని పాలించి అవినీతి లేకుండా చెయ్యాలని ఆశిస్తున్నానని ప్రశాంత్ ఆకాంక్షించారు. మొత్తానికి లేఖలో కే్జ్రీవాల్ పై బాంబులు పేల్చిన ప్రశాంత్ భూషణ్ చివర్లో మాత్రం కేజ్రీవాల్, ఆప్ కు గుడ్ లక్ అండ్ గుడ్ బాయ్ అని చెప్పేశారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more