ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో భాగంగా సిడ్నీ వేదికగా ఢిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో అతిధ్య జట్టు అస్ట్రేలియా ధోని సేన ముందు 329 పరుగులు విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ను స్మిత్, ఫించ్ నిలబెట్టారు. రెండో వికెట్ కు 182 బంతుల్లో 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 197 స్కోరు వద్ద వీరి భాగస్వామ్యాన్ని ఉమేష్ యాదవ్ విడదీశాడు. సెంచరీ వీరుడు స్మిత్(105) పరుగుల వద్ద అవుట్ చేశాడు.
స్మిత్ మొత్తం మ్యాచ్ ను తన వైపు తిప్పుకున్నాడు. పదకొండు ఫోర్లు రెండు సిక్స్ లతో రాణించాడు. అటు మరో ఓపెనర్ ఫించ్ 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఏడు ఫోర్లు, 1 సిక్స్ తో రాణించిన ఫించ్ నిలకడగా అడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు. 232 పరుగుల వద్ద విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్ వెల్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. 233 పరుగుల వద్ద ఫించ్ అవుటడవడంతో ఒక్క పరుగు తేడాతో ఆసీస్ 2 వికెట్లు చేజార్చకుంది. తర్వాత వరుసగా కెప్టెన్ క్లార్క్(10), ఫాల్కనర్(23), వాట్సన్(28) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
కాగా ఈ ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం 2003 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ను తలపిస్తోంది. అదే ఉత్కంఠ, గెలుపు ఎవరిదని యావత్ భారతవని ఎదురుచూపులు.. మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఆలయాల్లో పూజలు, మసీదుల్లో ఖురాన్ ఫఠనాలు కొనసాగుతున్నాయి. 2003లో ముందుగా బ్యాటింగ్ చేసిన అసీస్ ను కెప్టెన్ రికీ పాంటింగ్ దూకుడుగా ఆడి 359 పరుగులను సాధించారు. కేవలం రెండు వికెట్లను కోల్పియన అసీస్ ను రికీపాటింగ్ ఎనమిది సిక్స్ లు, నాలుగు ఫఓర్ల సాయంతో 140 పరుగులు సాధించడం, అతనికి మరో ఎండ్ లో వున్న మార్టిన్ కూడా ఒక సిక్స్, ఏడు ఫోర్ల సాయంతో 88 పరుగులు సాధించింది.
అయితే ఆ ఫైనల్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఓపెనర్ వీరేంద్ర సేహ్వాగ్ (82), రాహుల్ ద్రావీడ్(47) మినహా ఇతర బ్యట్స్ మెన్లు ఎవ్వరూ రాణించకపోవడంతో భారత్ ఆ మ్యాచ్ లో పరాజయం పాలైంది. దీంతో ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో మ్యాచ్ ను గెలుపోందింది. మెక్ గ్రాత్ మూడు వికెట్లు తీసుకోగా, బ్రెట్ లీ రెండు, సైమండ్స్ రెండు విక్కెట్లను తీసి భారత్ ఆటగాళ్లను నియంత్రిచారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more