Woman complaints on hudband in chennai

woman complaints on hudband in chennai, husband complaints on wife parents in chennai, chennai woman comp;laints on husband, husband druged and molested wife, man druged and married woman, husband complaints on wife parents, wife parents kidnapped woman,

woman complaints on husband in chennai that he druged her and married her, then after he molested her

మూడు ముళ్ల బంధానికి పరాకాష్ట.. వ్యామోహం వదిలింది..!

Posted: 03/19/2015 09:05 PM IST
Woman complaints on hudband in chennai

పెళ్లంటే పందిళ్లు.. చప్పట్లు, తాళాలు, మేళాలు తలంబ్రాలు.. మూడు ముళ్లు, ఏడే అడుగులు మొత్తం కలసి నూరేళ్లు అంటూ సినీ కవులు వందేళ్ల జీవితాన్ని వివరిస్తుండగా.. మూడు ముళ్ల బంధానికి పరాకాష్టగా నిలుస్తోంది ఈ ఘటన. ఆ జంట పెళ్లి చేసుకున్నారు. కలసి కాపురమూ చేశారు. చివరికి తన భర్తంటే తనకు ఇష్టంలేదని.. తాను అమెను మత్తు మందు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడని, అంతేకాదు తనపై అత్యాచారం కూడా చేశాడని ఆరోపించి.. నూరేళ్ల బంధాన్ని.. చిన్న పిలల్ల ఆటగా మలిచారు. భర్త మాత్రం తన భార్యను అత్తమామలు కిడ్నాప్ చేశారని మరో పిర్యాదు ఇచ్చాడు. ఇంతకీ వీరిద్దరు చెబుతున్న కథనాలలో ఎవరిది నిజం..? ఎవరిది అబద్దం..?

వివరాల్లోకి వెళ్తే.. ఊటికి చెందిన రమ్య చెన్నైలో ఒక ప్రైవేటు కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతోంది. కళాశాల ఎదుటగల ఉమెన్ హాస్టల్‌లో బసచేస్తోంది. అమెకు, కృష్ణగిరిలో జిమ్ నడుపుతున్న కుమార్ అనే 27 ఏళ్ల యువకుడితో పరిచయమైంది. ఇద్దరు కొన్నాళ్ల క్రితం స్థానికంగా గల ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. దీంతో హాస్టల్ వదిలిన యువతి కుమార్ తో కలిసి విడిగా ఇల్లు తీసుకుని సంసార జీవనాన్ని సాగించారు. విషయం తెలుసుకున్న రమ్య తల్లిదండ్రులు అమె వద్దకు వచ్చారు. అమెను సముదాయించడంలో ప్రతిఫలం సాధించిన వాళ్లు అమెను తమ నివాసానికి తీసుకెళ్లారు.

స్వస్థాలనికి చేరుకున్న రమ్య మనస్సును కూడా మర్చడంలో సక్సెస్ సాధించిన తల్లిదండ్రులు అమెతో తన భర్తకు వ్యతిరేకంగా ఫిర్యాదు ఇప్పించారు. తన భర్త కుమార్ తనకు మత్తు మందునిచ్చి వివాహం చేసుకున్నాడని, అ తరువాత అత్యాచారం కూడా చేశాడని రమ్య చెన్నై పోలీసులకు ఇఛ్చిన పిర్యాదులో పేర్కొంది. సృహలోకి వచ్చిన తాను తాళి విసిరికొట్టి చెన్నై చేరుకున్నానని పేర్కొంది. ప్రస్తుతం అతను తన వద్దకు రాకుంటే హత్య చేస్తానని బెదిరిస్తున్నట్లు తెలిపింది. అందుచేత కుమార్‌పై చర్యలు తీసుకోవాలని రమ్య ఎగ్మూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదిలా వుండగా, తన భార్యను అప్పగించాలంటూ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో కుమార్ తరపున ఫిర్యాదు అందింది. తన భార్యను తన అత్తమామలు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేశారని కుమార్ తన పిర్యాదులో పేర్కోన్నారు. పెళ్లైన యువకుడికి మరో అమ్మాయి దోరకడం ఎంత కష్టమో.. అత్యాచారం జరిగిందని అరోపిస్తున్న అమ్మాయికి వరుడు దోరకడం కూడా అంతే కష్టం. అందుకనే తమకున్నది వ్యామోహమా..? లేక నిజమైన ప్రేమా..? తెలుసుకోకుండా యువతీ యువకులు.. తమ జీవితాలకు సంబంధించిన విషయాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని వ్యామోహంలో తీసుకునే నిర్ణయాలు నాలుగు రోజులే వుంటాయని మానసిన నిఫుణులు పేర్కోంటున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman compliant  husband  chennai police  ooty police  

Other Articles