పెళ్లంటే పందిళ్లు.. చప్పట్లు, తాళాలు, మేళాలు తలంబ్రాలు.. మూడు ముళ్లు, ఏడే అడుగులు మొత్తం కలసి నూరేళ్లు అంటూ సినీ కవులు వందేళ్ల జీవితాన్ని వివరిస్తుండగా.. మూడు ముళ్ల బంధానికి పరాకాష్టగా నిలుస్తోంది ఈ ఘటన. ఆ జంట పెళ్లి చేసుకున్నారు. కలసి కాపురమూ చేశారు. చివరికి తన భర్తంటే తనకు ఇష్టంలేదని.. తాను అమెను మత్తు మందు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడని, అంతేకాదు తనపై అత్యాచారం కూడా చేశాడని ఆరోపించి.. నూరేళ్ల బంధాన్ని.. చిన్న పిలల్ల ఆటగా మలిచారు. భర్త మాత్రం తన భార్యను అత్తమామలు కిడ్నాప్ చేశారని మరో పిర్యాదు ఇచ్చాడు. ఇంతకీ వీరిద్దరు చెబుతున్న కథనాలలో ఎవరిది నిజం..? ఎవరిది అబద్దం..?
వివరాల్లోకి వెళ్తే.. ఊటికి చెందిన రమ్య చెన్నైలో ఒక ప్రైవేటు కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతోంది. కళాశాల ఎదుటగల ఉమెన్ హాస్టల్లో బసచేస్తోంది. అమెకు, కృష్ణగిరిలో జిమ్ నడుపుతున్న కుమార్ అనే 27 ఏళ్ల యువకుడితో పరిచయమైంది. ఇద్దరు కొన్నాళ్ల క్రితం స్థానికంగా గల ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. దీంతో హాస్టల్ వదిలిన యువతి కుమార్ తో కలిసి విడిగా ఇల్లు తీసుకుని సంసార జీవనాన్ని సాగించారు. విషయం తెలుసుకున్న రమ్య తల్లిదండ్రులు అమె వద్దకు వచ్చారు. అమెను సముదాయించడంలో ప్రతిఫలం సాధించిన వాళ్లు అమెను తమ నివాసానికి తీసుకెళ్లారు.
స్వస్థాలనికి చేరుకున్న రమ్య మనస్సును కూడా మర్చడంలో సక్సెస్ సాధించిన తల్లిదండ్రులు అమెతో తన భర్తకు వ్యతిరేకంగా ఫిర్యాదు ఇప్పించారు. తన భర్త కుమార్ తనకు మత్తు మందునిచ్చి వివాహం చేసుకున్నాడని, అ తరువాత అత్యాచారం కూడా చేశాడని రమ్య చెన్నై పోలీసులకు ఇఛ్చిన పిర్యాదులో పేర్కొంది. సృహలోకి వచ్చిన తాను తాళి విసిరికొట్టి చెన్నై చేరుకున్నానని పేర్కొంది. ప్రస్తుతం అతను తన వద్దకు రాకుంటే హత్య చేస్తానని బెదిరిస్తున్నట్లు తెలిపింది. అందుచేత కుమార్పై చర్యలు తీసుకోవాలని రమ్య ఎగ్మూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదిలా వుండగా, తన భార్యను అప్పగించాలంటూ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో కుమార్ తరపున ఫిర్యాదు అందింది. తన భార్యను తన అత్తమామలు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేశారని కుమార్ తన పిర్యాదులో పేర్కోన్నారు. పెళ్లైన యువకుడికి మరో అమ్మాయి దోరకడం ఎంత కష్టమో.. అత్యాచారం జరిగిందని అరోపిస్తున్న అమ్మాయికి వరుడు దోరకడం కూడా అంతే కష్టం. అందుకనే తమకున్నది వ్యామోహమా..? లేక నిజమైన ప్రేమా..? తెలుసుకోకుండా యువతీ యువకులు.. తమ జీవితాలకు సంబంధించిన విషయాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని వ్యామోహంలో తీసుకునే నిర్ణయాలు నాలుగు రోజులే వుంటాయని మానసిన నిఫుణులు పేర్కోంటున్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more