ముంపు మండలాల విలీనంపై తెలంగాణ అసెంబ్లీ వేడెక్కింది. దానికి కారణం మీరంటే మీరు అంటూ కాంగ్రెస్, తెరాస నేతలు పరస్పర విమర్శలకు దిగారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో కేంద్రం భద్రాచలానికి చెందిన ఏడు మండలాలను కలుపితే ఎవ్వరూ నోరు మెదపలేదని , ఆంధ్రాలో కలిపి ఆ ఏడు మండలాలకు తీరని అన్యాయం చేశారంటూ పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర కలకలాన్ని రేపింది. దీనిపై స్పందించిన తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావ్ కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉండగా దాన్ని అడ్డుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ వల్లే ఆ ఏడు మండలాలు ఆంధ్రాప్రాంతంతో కలిశాయని అన్నారు. కాంగ్రెస్ ను దోషిని చేస్తు హరీష్ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్మే చిన్నారెడ్డి తప్పుపట్టారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించని తెరాస ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టాలని అనుకుంటోందని మండిపడ్డారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడు మండలాలు ఆంధ్రాప్రాంతంలోకి కలుపుతూ కేంద్రం నిర్ణయించినా ఎలాంటి స్పందనా తెలపలేదని కెసిఆర్ పై మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. కేవలం కాంగ్రెస్ కారణంగానే తెలంగాణకు న్యాయం జరిగిందని వారు తెలిపారు. ఇలా టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే బిజెపి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ మధ్యలో అందుకున్నారు. ఏడు ముంపు మండలాలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. ఏడు మండలాల విలీన అంశంపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రానికి కావలసిన హక్కులు సాధించేందుకు తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more