ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్. బందీలను అతికిరాతకంగా నరికి చంపి, ఆ వీడియోలను నెట్ లో పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న సంస్థ. మనుషుల నెత్తుటి రుచి మరిగిన ఐఎస్ఐఎస్ ఇపుడు సోషల్ మీడియాను బాగా వాడుకుంటోంది. ఐఎస్ఐఎస్ మద్దతు దారుల్లో 46 వేల మందికి 2014లో ట్విట్టర్ అకౌంట్లు వుండటమే ఇందుకు నిదర్శనం. ఐఎస్ఐఎస్ మద్దతు దారులు 2014 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య 46వేల ట్విట్టర్ అకౌంట్లను వినియోగించినట్లు తేలింది. ఐతే ఇవన్నీ ఒకే సమయంలో యాక్టివ్గా లేవని ఈ అంశంపై అధ్యయనం చేసిన జేఎం బెర్గర్, జోనాథన్ మోర్గాన్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ రిపోర్టును వాషింగ్టన్లో తాజాగా విడుదల చేశారు.2014 సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు 46 వేల నుండి 70 వేల ట్విట్టర్ అకౌంట్లలో ఐఎస్ఐఎస్ గురించి ట్వీట్లు చేశారు.
ఐఎస్ఐఎస్కు మద్దతుగా ట్విట్టర్ అకౌంట్లు కలిగిన వారిలో ఎక్కువ మంది సౌదీఅరేబియాకు చెందిన వారు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. తర్వాత స్థానాల్లో సిరియా, ఇరాక్, యూఎస్లకు చెందిన వారు ఉన్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంగ్లీష్లో ట్వీట్లు పోస్ట్ చేస్తుండగా, ఎక్కువ మంది తమ పోస్ట్ లను అరబిక్లో పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్ అకౌంట్ కలిగిన ఐఎస్ఐఎస్ మద్దతుదారుల్లో ప్రతి ఒక్కరికి వెయ్యిమందికి పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం. ప్రపంచం మొత్తం తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఐఎస్ఐఎస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా యువతను ఆకట్టుకోవటంపై దృష్టి పెట్టింది. తాజాగా విడుదలైన రిపోర్ట్ అన్ని దేశాలకు వణికుపుట్టిస్తోంది. అసలే ఆ సంస్థ చేస్తున్న దాష్టికాలను తట్టుకోలేపోతున్న దేశాలు, మరి కొంత మంది అదే బాటలో నడుస్తుండటంపై భయపడుతున్నాయి. అయితే ఐఎస్ఐఎస్ ఆగడాలను ఎలా అరికట్టాలా అని ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more