ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో భాగంగా పూల్ బి లోని దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ కు పది పరుగులు కలసివచ్చాయి. ఆక్లాండ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో వర్షం కారణంగా పాక్కు ఈ పరుగుల లాభం కలసివచ్చింది. వర్షంతో మ్యాచ్ను అంపైర్లు 47 ఓవర్లకు కుదించారు. అయితే సఫారీ బౌలర్ల బంతులకు విలవిలలాడిన పాకిస్థాన్ ఆటగాళ్లు 222 పరుగులకు చాప చుట్టేశారు. డక్వర్త్ లూయిస్ నిబంధనలు ప్రకారం అంపైర్లు దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 47 ఓవర్లలో 232గా నిర్ణయించారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ను సఫారీ బౌలర్లు బంతులతో ఆడుకున్నారు. ఓపెనర్లు సహా, కెప్టెన్ మిస్బావుల్ హక్ మాత్రమే రాణించారు. దీంతో ఇంకా రెండు బంతులు మిగిలివుండగానే పాక్ అటౌట్ అయ్యింది. సౌత్ ఆప్రికాతో ధాటిగానే ఆటను ప్రారంభించన ఓపెనర్లు ముందు బాగానే రాణించారు. 30 పరుగుల వద్ద ఓపెనర్ షెజాద్ (18) వికెట్ కోల్పోయింది. ఆ తరువాత మరో ఓపెనర్ అహ్మద్ ధాటిగా ఆడి స్కోరు బోర్డు నడిపించాడు.
అయితే లేని పరుగు కోసం ప్రయత్నించి అహ్మద్ సరిగ్గా హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ లతో రాణించిన అహ్మద్ 49 పరుగల వద్ద రనౌటయ్యాడు. అహ్మద్ అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన పాక్ను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మిస్బావుల్ హక్.. 56 పరుగులో ఆదుకున్నాడు. చివర్లో హక్, అఫ్రిది (22) స్కోరు వేగం పెంచే క్రమంలో ఔటయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ 3, అబాట్ 2, మోర్కెల్ 2, తాహిర్, డివిలియర్స్ చెరో వికెట్ తీశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more