ప్రవేటు ట్రావెల్స్ అరచకాలకు పరాకాష్టగా నిలుస్తోంది ఈ ఘటన. అర్థరాత్రి పూట అటవీ ప్రాంతంలో బస్సును నిలిపి.. మీ చావు మీరు చావండి.. ఇక బస్సు ఒక్క ఇంచు కూడా కదలదూ అంటూ డ్రైవర్ మొండికేయడంతో ప్రయాణికులు రాత్రంతా జాగారం చేసుకుంటూ.. బిక్కుబిక్కు మంటూ వెళ్లదీయాల్సి వచ్చింది. ప్రయాణికులు టిక్కట్టు బుక్ చేసుకునే ముందు ట్రావెల్ ఏజెంట్లు చెప్పే కబర్లు.. అన్ని వాస్తవ రూపంలో నీటి బుడగలని తెలిసినా.. అవసరాల నేపథ్యంలో సర్ధుకుపోతున్న ప్రయాణికులపై ప్రతీరోజు ఏదో ఒక రూపంలో ప్రైవేటు ట్రావెల్స్ తమ అరాచకాలను సృష్టిస్తునే వున్నాయి. క్షేమంగా గమ్యానికి చేర్చాలిన బస్సులు ప్రయాణికులను నడిరోడ్డు పైనే వదిలేస్తున్నాయి. నిన్నదీపికా ట్రావెల్స్... నేడు న్యూ ధనుంజయ ట్రావెల్స్... ప్రయాణికులను నడిరోడ్డుపై రాత్రంతా జాగారం చేయించాయి.
హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో విశాఖపట్నం బయల్దేరిన న్యూ ధనుంజయ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపైన నిలిచిపోయింది. సరిగ్దా అప్పటి బస్సు బయలుదేరి గంటన్నర కూడా కాలేదు. ఎయిర్ లాక్ అయిందంటూ బస్సును అర్ధంతరంగా నిలిపివేసిన డ్రైవర్ తనకు బాధ్యత లేదన్నట్టు వ్యవహరించాడు. విశాఖ పట్నానికి చేరుకునే క్రమంలో అదీ హైదరాబాద్ దాటిదాటక ముందే ఈ ఘటన జరిగింది. అయినా డ్రైవర్ కానీ, ట్రావెల్స్ యాజమాన్యం కానీ ఏ మాత్రం స్పందించలేదు. హుటాహుటిన వేరే బస్సును పంపించి ప్రయాణికులను సరక్షితంగా గమ్యస్థానాలకు చేరాల్సిన యాజమాన్యం కూడా తమకు పట్టనట్ల వ్యవహరించింది. దీంతో ప్రయాణికులు రాత్రంతా అవుటర్పై అవస్థలు పడ్డారు. ట్రావెల్స్ మేనేజ్మెంట్కి ఫోన్ చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు. దీంతో రాత్రంతా ప్రయాణికులు ఔటర్ రోడ్డుపై జాగారం చేశారు. అదీనూ చిమ్మచీకటి, అటవీ ప్రాంతానికి ఏమాత్రం తీసిపోని విధంగా వుంటే రోడ్డపై నానా అవస్థలు పడ్డారు. ఇవాళ తెల్లవారు జాము వరకు పరిస్థితి అలానే వుండింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బస్సు యాజమాన్యంతో చర్చలు జరిపి వేరే బస్సును తెప్పించి ప్రయాణికులను పంపించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more