భర్తల నుంచి విడాకులు పోందిన భార్యాలకు భరణం చెల్లించే విషయంలో బాంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత ఉద్యోగాలను చేసేందుకు అన్ని అర్హతలు వున్న సతులు వారి పతుల నుంచి భరణం పోందేందుకు అర్హులు కాదని తీర్పును వెలువరించింది. సంపాదించేందుక అన్ని అర్హతలు వున్నా.. భరణం కోసం భర్తలను భాదించడం సముచితం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భర్త సంపాదనను యోగ్యత కలిగిన భార్యలు.. వారి భర్తల నుంచి భరణం పొందే ప్రయోజనాన్ని పొందడం తప్పేనన్నారు.
ముంబాయి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి భార్య కోర్టును ఆశ్రయించి భరణం కావాలని అడిగిన కేసు పూర్వాపరాలను పరిశీలించిన తరువాత ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో భార్య అద్బతంగా సంపాదించే అవకాశాలను వదులుకుని కేవలం భర్త భరణంపైనే ఆధారపడాలని ఆశించడం కుదరదని, దీంతో ఆమెకు భరణం లభించే అవకాశం లేదని తేల్చిచెప్పింది. భరణం అన్నది అర్హత లేని భర్యాలకు మాత్రమే వర్తిస్తుందని అభిప్రాయపడింది. భర్త నుంచి విడాకులు పోంది ఏమి చేయాలో దిక్కుతోచని బార్యలు, వారి జీవనంతో పాటు పిల్లల భవిష్యత్తు ఇచ్చే నెలవారి ఖర్చులని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే ముంబాయికి చెందిన ప్రముఖ వ్యాపారికి కోట్ల రూపాయల వ్యాపారాలు వున్నాయని, ఆయన అన్నదమ్ములు కూడా వ్యాపారాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారని, అత్తవారింటి ఆరళ్లు భరించలేక తాను ఇప్పుడు వేరుగా వుంటున్నానని ఈ క్రమంలో తనకు భరణం కల్పించాలని ఆయన సతీమని కోర్టును ఆశ్రయించింది. దేశీయంగా, విదేశీ వ్యాపారాలతో నెలకు సుమారు పదిహేను లక్షల రూపాయల మేర వారు ఆర్జిస్తున్న క్రమంలో తనకు భరణం కింద నెలకు రెండు లక్షల రూపాయలను భరణం కింద ఇప్పించాలని కోరింది. తన తల్లిదండ్రులపై తాను ఆదనంగా భారం వేస్తున్నానని వాటికి ఖర్చుల కింద భరణం ఇప్పించాలని బాంబే హైకోర్టును కోరింది.
కాగా వ్యాపారి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాను చట్టబద్దంగా తన భార్యను వివాహమాడలేదని, అయితే గత ఏడాది సెప్టెంబర్ మాసంలో అమె తనకు ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకులు ఇచ్చిందని తెలిపారు. దీనికి తోడు అమె డైటీషియన్ అని, ఇప్పటికీ పలు ప్రముఖ ఆస్పత్రులలో ఆమె డైట్ కౌన్సిలింగ్ క్లాసులు తీసుకుంటుందని తెలిపారు. దీని ద్వారా అమె నెలకు రమారమి 50 వేల రూపాయలను ఆర్జిస్తారని చెప్పారు. అంతేకాకుండా సుమారు కోటి రూపాయల బంగారు, వజ్రాభరణాలు అమె పేరిట వున్నాయని వాటిని ప్రత్యేక బ్యాంక్ లాకర్ లో దాచిందని వాదనలు వినిపించారు.
ఉభయపక్షాల వాదప్రతివాదలను పరిశీలించిన న్యాయస్థానం అన్ని యోగ్యతలు వున్న భార్యకు.. భర్త నుంచి భరణం పోందే అవకాశం లేదని చెప్పింది. భర్త నుంచి భరణం పొందేందుకు ఖాళీగా కూర్చోని భరణం అడిగితే కుదరదని స్పష్టం చేసింది. సంపాదించే యోగ్యత వున్న తరువాత భరణం కోసం భర్తలను వేధించడం కూడా సముచితంకాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more