India sets 308 runs target fo south africa

india sets 308 runs target fo south africa, india lost seven wickets, ICC Cricket World Cup 2015, india vs south africa, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, virat kohli, Cricket, CWC 2015, india, india CWC 2015, Live Scores, Live Updates, south africa, siuth africa 2015, Sports, World Cup Live,

india scored 307 runs losing seven wickets and sets target of 308 to south africa in world cup

సఫారీలకు 308 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన భారత్..

Posted: 02/22/2015 01:05 PM IST
India sets 308 runs target fo south africa

చివరి వరకు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అప్ కలిగిన సపారీలతో అస్ట్రేలియాలోని మెలబోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా సఫారీలకు 308 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (146 బంతుల్లో 16 ఫోర్లు, 2  సిక్సర్లతో 137) ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్మురేపాడు. వన్డేలలో శిఖర్ ధావన్ తన అత్యధిక స్కోరును తిరగరాసుకున్నారు. సఫారీలపై గతంలో చేసిన 114 రన్స్ స్కోరును చెరిపేసి.. 137 పరుగులను సాధించాడు. రహానె (60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. భారత్ డాషిండ్ బ్యాట్స్ మెన్, వైస్ కాప్టెన్ విరాట్ కోహ్లీ కొద్దిలో హాప్ సెంచరీ మిస్ అయ్యి 46 పరుగులతో రాణించాడు. మొత్తంగా ధోణిసేన ఏడు విక్కెట్లను నష్టపోయి 307 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే రనౌటయ్యాడు. దీంతో ధవన్, కోహ్లీ పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ జట్టును మెరుగై దశకు తీసుకువచ్చేందుకు కృషి చేశారు. ధవన్, కోహ్లీ రెండో వికెట్కు 127 పరుగులు జోడించారు. కాగా కోహ్లీ 46 పరుగుల వద్ద ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో డుప్లెసిస్కు క్యాచిచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రహానె, కూడా పరుగుల వరద సృష్టించాడు. ఈ క్రమంలో ధవన్ సెంచరీ, రహానె హాఫ్ సెంచరీ చేశారు. వీరిద్దరూ మూడో వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరును 250 మార్క్ దాటించారు. అనంతరం ధావన్ ఔటవ్వడంతో భారత్ పరుగుల వరదకు బ్రేకులు పడ్డాయి.

కాగా టిమిండియా మిడిల్ ఆర్డర్ మళ్లీ విఫలమైంది. భారత్ స్కోరును సుమారుగా 330 పరుగులు దాటిస్తుందని అభిమానులు ఆశించిన తరుణంలో సురేష్ రైనా, జెడేజా, దోణి లు విఫలమైయ్యారు. పటిష్టసాయిలో వుండి శాసిస్తున్న తరుణంలో వరస విక్కెట్లను కోల్పోయిన భారత్.. మూడు వందల పరుగులను దాటడమే కష్టమనిపించింది. అయితే ధోణి వరుసగా హ్యట్రిక్ ఫోర్లను సాధించడంతో భారత్ మూడు వందల మార్కును దాటింది. షమీ.. స్టీన్ బౌలింగ్ లో ఒక బౌండరీని సాధించడంతో భారత్ 307 పరుగులను సాధించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  india  south africa  virat kohli  

Other Articles