మోదీ సూట్ వేలం దేశవ్యాప్తంగా ప్రధాన వార్తగా నిలిచింది. పది లక్షల సూట్ కు యాభై లక్షల నుండి ప్రారంభమైన బిడ్డింగ్ అతకంతకు పెరగి చివరకు 4 కోట్ల పైగానే అమ్మడుపోయింది. అయితే ప్రధానిగా మోదీ అధికారం చేపట్టినప్పటి నుండి ఆయన వాడిన వస్తువులను ఈ వేలంలో ఉంచారు. అయితే ఓ ప్రధాని వాడిన వస్తువులను ఇలా వేలం వెయ్యడం ఏంటని కొందరు విమర్శలు కూడా చేశారు. అయితే మోదీ సూట్ వేలం పై శివసేన కూడా స్పందించింది.
ప్రజాదరణ ఉన్న నేత కాబట్టే ప్రధాని మోదీ సూట్ మరి అంత ఖరీదు చేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వస్తువులను వేలం వేస్తే, ఎంతకు పోతాయో తెలుస్తుందని శివసేన తన పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురించింది. అయితే రాహుల్ ఒక్కడి దగ్గరే ఆపకుండా ఆప్ అధినేతను లాగింది. మఫ్లర్ మ్యాన్ గా ఉన్న కేజ్రీవాల్ మఫ్లర్ కూడా వేలానికి పెడితే ఎవరి ఆదరణ ఎంత ఉందో తెలిసిపోతుందని పేర్కొంది. అయితే గత కొంత కాలంగా బీజేపీతో కయ్యానికి కాలుదువ్వని శివసేన ఇలా మోదీని అమాంతం ఆకాశానికెత్తడం రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన గతకొంత కాలంగా భాజపాతో విభేదిస్తూ వచ్చింది. మోదీ కొన్ని రోజుల క్రితం శరద్ పవార్ తో సన్నిహితంగా మెలగడంతో, ఎన్సీపి, భాజపాలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని వార్తులు వెలువడ్డాయి. బహుషా ఎన్సీపితో భాజపా దోస్తీ కట్టే ప్రమాదం ఉందనే, శివసేన ఇలా మోదీ జపం చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి వేలం వెర్రి ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more