ప్రపంచ కప్ పూల్ బిలోని తొలి మ్యాచ్లోనే టీమిండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా 301 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్కు నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ధోనీసేన నిర్ణీత ఓవర్లో 7 వికెట్లకు 300 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ (107) సెంచరీకి తోడు సురేష్ రైనా (74), ధవన్ (73) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 300 మార్క్ చేరుకోగలిగింది. పాకిస్థాన్ బౌలర్ సొహైల్ ఖాన్ 5 వికెట్లు తీశాడు.
భారత ఓపెనర్ రోహిత్ శర్మ (15) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ ధవన్ రాణించాడు. ధవన్కు కోహ్లీ అండగా నిలిచి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో ధవన్ రనౌటయ్యాడు. అయితే సురేష్ రైనా క్రీజులో నిలిచి ధవన్ లేని లోటును తీర్చాడు. రైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. రైనా, కోహ్లీ మూడో వికెట్కు 110 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ, రైనా హాఫ్ సెంచరీ చేశారు.
45 ఓవర్లలో టీమిండియా స్కోరు 273/2. అప్పటికి విరాట్ సెంచరీ, రైనా మెరుపు హాఫ్ సెంచరీ చేసి మాంచి దూకుడు మీదున్నారు. దీంతో భారత్ కనీసం 320 పరుగులు చేస్తుందనిపించింది. అయితే సొహైల్ ఖాన్ వరుస ఓవర్లో కోహ్లీ, రైనాను అవుట్ చేయడంతో స్కోరుబోర్డు మందగించింది. కోహ్లీ.. అక్మల్కు, రైనా హారిస్ సొహైల్కు క్యాచిచ్చారు. ఆ తర్వాత జడేజా 5 బంతులాడి 3 పరుగులకే వెనుతిరగగా, రహానే పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ధోనీ (18) ఫర్వాలేదనిపించినా చివరి ఓవర్లో అవుటయ్యాడు. దీంతో భారత్ చివర్లో దూకుడుగా ఆడలేకపోయింది. కష్టమ్మీద 300 మార్క్ చేరుకుంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more