ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలుకావడంతో.. పూర్తిగా చతికిల పడింది. కొద్దిగా ఆసరా తీసుకుని మళ్లీ లేగుద్దామని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నాయకులే ప్రత్యక్ష దాడికి పాల్పడి.. అచేతనావస్థకు కారణమవుతున్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో పదేళ్ల పాటు కీలక మంత్రిత్వశాఖల బాధ్యతలను కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం మరోసారి పార్టీపై విమర్శలతో పాటు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ని చూసి నేర్చుకోవాలని కార్తీ చిదంబరం కాంగ్రెస్కు సలహాలు ఇచ్చారు.
కార్తీ చిదంబరం చెన్నలో మీడియాతో మాట్లాడుతూ.. 'అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు 'ఆప్'కు అభినందనలు తెలిపారు. ఆప్ను చూసి కాంగ్రెస్ ప్రత్యేకించి...తమిళనాడు కాంగ్రెస్ చాలా నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకత్వం బాగుంటేనే పార్టీ బలోపేతం అవుతుందనే విషయం గమనించాలి. పార్టీకి ఓ ప్రత్యేక ఎజెండాను తయారు చేసుకోవాలి. ప్రజాదరణ కలిగిన నాయకుణ్ని ఎంపిక చేయాలి. నాయకుడిని ఎంపిక చేయటంలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావని అన్నారు.
ఇప్పటికే పలుమార్లు సొంత పార్టీపై విమర్శలు చేసిన కార్తీ అధిష్టానం నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నా.. తన ధోరణి మాత్రం మార్చుకోలేదు. ఇన్నాళ్లు తన తండ్రి హోదాకు మర్యాద ఇచ్చిన కాంగ్రెస్ నేతలు కార్తీ చిదంబరానికి కూడా అదే మర్యాదను ఇచ్చారు. మరి పదవి పోయిన తరువాత అదే మర్యాద రావాలంటే ఎలా లభిస్తుంది. అందుకే కార్తీ చిదంబరం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారని పార్టీ వర్గాల గుసగుసలాడుతున్నియి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more