'సెక్యులర్, సోషియలిస్టిక్ అనే రెండు పదాలపై శివసేన చేసిన అభ్యంతరాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజానికి ఆ రెండు పదాలు రాజ్యాంగం ప్రవేశపెట్టినపుడు లేవు అన్నది వాస్తవం. కానీ ఇందిరా గాంధీ హయాంలో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రెండు పదాలను చేర్చారు. దీనిపైనే శివసేన తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగంలో వాటి అవసరం లేదని అందుకే వాటిని తొలగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. బిజెపి పార్టీ మిత్రపక్షం కనుక శివసేన ప్రతి వ్యాఖ్య బిజెపిని ఇరుకున పెట్టేస్తుంది. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వాటిని చేర్చారని, రాజ్యాంగ పరిషత్ వాటిని చేర్చాలని అనుకోలేదు కాబట్టే రాజ్యాంగంలో పొందుపర్చలేదని వారి వాదన.
ఇక రాజ్యాంగంలో చేర్చిన ప్రతి పదం, అంశం ఎంతో ముఖ్యమైంది. ఎంతగా అంటే ఒక్క పదం దేశం మొత్తం జనాభాపై ప్రభావాన్ని చూపుతుంది. మరి అలాంటిది రెండు పదాలను రాజ్యాంగం నుండి తొలగించాలంటే ఎంతో ఆలోచించాల్సిందే. లౌకికవాదం అనేది రాజ్యాంగబద్ధం కనుక లౌకికవాదం ఆధారంగా ప్రభుత్వాన్ని తొలగిస్తే అంగీకరిస్తామని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే రాజ్యాంగ పీఠికలోని లౌకికత్వానికి ఉన్న ప్రాధాన్యత తెలియచేస్తుంది. లౌకికం, సోషలిస్టు అనే పదాలను 1976లో చేర్చారు. అయినా ఎస్.ఆర్.బొమ్మై కేసు తరువాత వచ్చిన అనేక కేసుల్లో లౌకికవాదం, సామ్యవాదం రెండూ రాజ్యాంగ పీఠికలో భాగం. మొత్తానికి లౌకిక, సామ్యవాద అనేవి పదాలు మాత్రమే కాదు అన్నది వాస్తవం. ఈ వివాదంపై వెంకయ్య నాయుడు సవివరణ ఇచ్చారు 1976 కు ముందు లౌకిక, సామ్యవాద అనే పదాలు లేకపోయినా భారత్ లో రెండు పదాల లక్షణాలు కనిపించాయని వివరించారు. శివసేన ఎలాంటి కారణాలు లేకుండా లేనివివాదాలకు తావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more