Gandhi under rosaish feet guntur tamilnadu governor

under rosiahs feet, gandhi photo controversy, tamilnadu governor controversy

gandhi under rosaish feet guntur tamilnadu governor : in guntur an invitaion create controversy. in that gandhi photo under the feet of roshaiah. and also modi, amith sha, chandrababu, venkaiah

అపచారం..రోశయ్య పాదాల వద్ద గాంధీ బొమ్మ

Posted: 02/07/2015 03:35 PM IST
Gandhi under rosaish feet guntur tamilnadu governor

గుంటూరుజిల్లా చిలకలూరిపేటలో జాతిపిత గాంధీ విగ్రహావిష్కరణలో అపచారం జరిగింది. యావత్ దేశం జాతిపితగా కొలిచే గాంధీగారి బొమ్మను తమిళనాడు గవర్నర్ రోశయ్య  పాదాల కింద ఉంచిన ఆహ్వాన పత్రం తీవ్ర కలకలం రేపింది. దాంతో విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు తీవ్ర నిరసన తెలిపారు. జాతిపితను అవమానించారంటూ వారు వ్యతిరేకత వ్యక్తం చెయ్యడంతో రోశయ్య తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

చిలకలూరిపేటలో గాంధీ విగ్రహ దాత పంపిణి చేసిన ఆహ్వాన ఈ గందరగోళానికి కారణమైంది. జాతిపిత గాంధీతో పాటు ప్రధాని నరేంద్రమోది, అమిత్ షా, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడుల ఫోటోలను రోశయ్య పాదాల కింద ప్రింట్ చేశారు.  స్థానిక బిజెపి నేత పూర్ణచంద్రరావు ఈ విషయాన్ని రోశయ్య దృష్టికి తీసుకు వచ్చారు. దాంతో రోశయ్య హుటాహుటిన తను కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉండి ఇలా వివాదాస్పద ఫోటోలలో కనిపించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

కాగా ఇది కేవలం ప్రైవేట్ కార్యక్రమం మాత్రమేనని, రోశయ్యకు ఎలాంటి సంబందం లేదని అధికారులు వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్య, యుపిఎ హయంలో తమిళనాడు గవర్నర్ గా నియమితులయ్యారు. వచ్చే సంవత్సరంతో రోశయ్య పదవి కాలం ముగియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamilnadu governer roshiah  photo controversy  gandhi photo under feet  

Other Articles