అవిభక్త కవలలు వీణా-వాణిల శస్త్రచికిత్సపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలోనే వారు విడిపోతున్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సాయం చేయనుంది. ఎంతో సంక్షిష్టమైన ఈ చికిత్స చేపట్టేందుకు తాజాగా లండన్కు చెందిన ప్రఖ్యాత ఆస్పత్రి గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ వైద్యులు డాక్టర్ డేవిడ్ డునావే, డాక్టర్ జిలానీలతో కూడిన వైద్య బృందం ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ బృందం మెదళ్లు కలిసి పుట్టిన ఏడాది వయసున్న కవలలను విజయవంతంగా వేరు చేసింది. ఇదే విధానంలో ప్రస్తుతం వీణా-వాణిలను కూడా వేరు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నిలోఫర్ వైద్యుల అభ్యర్థన మేరకు ఆ బృందం హైదరాబాద్ కు వచ్చింది. నీలోఫర్ వైద్యుడు రమేశ్ తో లండన్ వైద్యులు చర్చలు చేపట్టారు. శస్త్రచికిత్సకు వున్న అవకాశాలను వైద్యులు అడిగి తెలుసుకుంటున్నారు. పిల్లలను పరీక్షించి అవసరమైతే లండన్కు తీసుకువెళ్లి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆపరేషన్ విజయవంతమైతే దాదాపు 12 ఏళ్లుగా అనుభవిస్తున్న నరకయాతన నుంచి ఆ చిన్నారులకు విముక్తి దొరికినట్లే.
ఈ చిన్నారులకు సాయం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా సానుకూలత ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కేవలం వైద్య పరీక్షలతో సరిపెట్టకుండా శస్త్రచికిత్స చేయించి వారికి విముక్తి కల్పించాలని కవలల తల్లిదండ్రులు మారగాని మురళి, నాగలక్ష్మి వేడుకున్నారు. వారు శుక్రవారం తమ సొంతవూరిలో మాట్లాడుతూ లండన్ వైద్యులు ఎలాగైనా తమ పిల్లలకు శస్త్రచికిత్స చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
గతంలోనూ వీణా వాణీలను విడదీసేందుకు పలు ప్రయత్నాలు జరిగాయి. గుంటూరుకు చెందిన ప్రముఖ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ నాయుడమ్మ వారికి అపరేషన్ చేసేందుకు చర్యలు తీసుకునే లోపు ఆయన పదవీ విరమణ చేశారు. ఆ తరువాత 2007లో ముంబయికి చెందిన బ్రీచ్కాండి ఆస్పత్రి వైద్యులు ముందుకొచ్చినా..సంక్షిష్టం కావడంతో వెనుకాడారు. 2009లో సింగపూర్కు చెందిన కీత్గో బృందం పరీక్షలు చేసింది. అయితేఅక్కడ చికిత్సకు ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేయడంతో నిలిచిపోయింది. కాగా ఇదే తరహా శస్త్ర చికత్సను విజయవంతంగా పూర్తి చేసిన లండన్ వైద్యుల ఆగమనంతో అక్కచెల్లళ్లలో నూతన ఆశలు నెలకొన్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more