భారత నల్లధన కుబేరుల జాబితాను ప్రకటించడం కన్నా.. నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడమే ప్రధానమని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాపడిన నేపథ్యంలో చట్టాలను సవరించడంతోనే నల్లధనాన్ని వెనక్కుతీసుకురాగలమని ప్రముఖ న్యాయవాది రాంజఠ్మలానీ అన్నారు. విదేశాలలో మూలుగుతున్న నల్లధనం, దానిని వెనక్కు రప్పించే అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసిన రాంజఠ్మాలానీ.. గత యూపీఏ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంలో ఆయన ప్రస్తుతం కేంద్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికల వేళ ప్రజలకు 100 రోజుల్లో భారత నల్లధన కుబేరులకు చెందిన ధనాన్ని వెనక్కు తీసుకవస్తామని చెప్పిన బీజేపి.. అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు కావస్తున్నా.. ఇప్పటికీ నల్లధనం తీసుకురావడంలో విఫలమైందని ఆయన సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని వ్యక్త పర్చారు. ఇప్పటి వరకు ఒక్క పైసా నల్లధనాన్ని కూడా మోడీ ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని తన అవేదనను వ్యక్తం చేశారు. తాను తన డబ్బుకోసం అగడం లేదని, విదేశాలలో మూలుగుతున్న భారత జాతి సోమ్మును వెనక్కు తీసుకురమ్మని కోరుతున్నానని జస్టిస్ హెచ్ ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి లోకూర్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ముందు తన వాదనను బలంగా వినిపించారు.
ప్రస్తుతం వున్న పాత చట్టాల స్థానాలలో నూతన చట్టాలను తీసుకువచ్చి నల్లధనాన్ని వెనక్కు తీసుకురావాలని ఆయన కోర్టుకు తెలిపారు. లేని పక్షంలో ప్రస్తుతం ఉన్న చట్టాలకు సవరణల చేసి నలధనాన్ని తీసుకురావాలని రాంజఠ్మలాని కోరారు. అలా మార్పులు చేర్పులు చేయనంత కాలం నల్లధనం అంశంలో ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పారు. నల్లధనం వెనక్కు తీసుకువచ్చే అంశంలో ఆచరించాల్సిన విధానాలతో ఒక ప్రతిపాదనను ఆయన కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అందించారు. అయితే ఈ అంశాలను పరిశీలించాల్సిందిగా ప్రధాని మోడీ ఆర్థిక మంత్రిత్వ శాఖను అదేశించినా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రాంజఠ్మలానీ తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more