గుజరాత్లో ఓ నవవధువుపై అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏడుగురు మగమృగాళ్లు 18 ఏళ్ల నవ వదువుపై నీచంగా విరుచుకుపడి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లా షినోర్ తాలూకా భీతాలీ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నవ వదువు యు, ఆమె కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇంట్లోకి దుండగులు చొరబడి, ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఉపాధి కోసం వలసవచ్చిన అమెపై కామాంధులు కన్నువేసి.. సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. తన అత్తామామాలు, భర్తతో పాటుగా ఇటీవలే వడోదర జిల్లాో షినోర్ తాలుకాలోని భీతాలి గ్రామానికి వచ్చింది. ఆ కుటుంబానికి గ్రామానికి చెందిన భూ యజమాని కూలీలుగా పని ఇచ్చాడు. నిందితులు యువతిని పొలాల్లోని నిర్మానుష్యమైన ప్రదేశానికి ఎత్తుకెళ్లారు.
తన భార్యను ఎత్తుకుపోయిన వెంటనే ఆమె భర్త పొలాల యజమాని వద్దకు పరుగెత్తాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. నిందితులు తమ ముఖాలకు ముసుగు కప్పుకుని, చంపేస్తామని బెదిరించి యువతిని ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఛటో ఉదేపూర్లోని నాస్వాడి తాలూకా నిషానా గ్రామానికి చెందినవారు. ఈ సంఘటన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. యువతికి ఎస్ఎస్జి ఆస్పత్రిలో వైద్య చికిత్స జరుగుతోంది.
నిందితులందరూ పాతికేళ్ల నుంచి ముఫై ఏళ్ల లోపు వయస్కులేనని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కాగా గత ఐదు రోజుల్లో గుజరాత్లో ఇటువంటి సంఘటనల్లో ఇది రెండోది. ఈ నెల 14వ తేదీన నలుగురు వ్యక్తులు మహిసాగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ బాలికపై అత్యాచారం చేసి ఆమెను చంపేశారు. ఆమెను గొంతు నులిమి చంపేసి చెట్టుకు వేలాడదీశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more