తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దొంగలు పట్టపగలు 12 లక్షల రూపాయలను సినీ ఫీక్కీలో చోరీ చేసి జారుకున్నారు. బాధితుడి దృష్టి మరల్చి క్షణాల్లో 12 లక్షల రూపాయలను స్వాహా చేశారు. పది రూపాయల నోట్లు కారు వద్ద చల్లిన దొంగ కారు లోపల ఉన్న క్యాఁష్ బ్యాగ్ను పట్టుకుని ఉడాయించాడు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ శాంతినగర్కు చెందిన కొండాపు సూర్యనారాయణరెడ్డి హోటల్ వ్యాపారం చేస్తుంటాడు.
అతడు పద్మాలయ గృహమందిర్ యజమానికి రూ.12 లక్షలు ఇవ్వడానికి కాకినాడ మెయిన్ రోడ్డులోని శ్రీనికేతన్ వద్దకు వచ్చాడు. ఈ లోపు ఓ ఆగంతకుడు కారు చుట్టూ రూ.పది కొత్త నోట్లు చెల్లాచెదురుగా పడేశాడు. అప్పటికీ సూర్యనారాయణరెడ్డి కారు డోరు కూడా తెరవకుండా తాను డ్రైవర్ సీట్లో, సొమ్ములు తెచ్చిన బ్యాగును ఆ పక్కసీటులో పెట్టి కూర్చున్నాడు.
ఆగంతకుడు ఇంతలో కారు తలుపు తట్టడంతో సూర్యనారాయణరెడ్డి తలుపు తెరిచాడు. అప్పటికే కిందపడేసిన రూ.పది నోట్లు చూపిన ఆగంతకుడు ‘మీ డబ్బులే.. కింద పడిపోయాయి.. తీసుకోండి..’ అన్నాడు. సూర్యనారాయణరెడ్డి చెల్లాచెదురుగా పడి ఉన్న నోట్లను తీస్తుండగా ఆగంతకుడు కారులోని నగదు బ్యాగ్ కాజేసి పరారయ్యాడు. కిందపడి ఉన్న 12 నోట్లను జేబులో పెట్టుకున్న సూర్యనారాయణరెడ్డి తీరా చూస్తే కారులోని నగదు బ్యాగ్ కనబడలేదు. చుట్టుపక్కల గాలించినా ఆగంతకుడి జాడలేదు.
దీంతో సూర్యనారాయణరెడ్డి టూ టౌన్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూ టౌన్ సీసీఎస్ ఎస్సై ఎం.జానకీరామ్ కేసు నమోదు చేశారు. కాకినాడ క్రైం డీఎస్పీ పిట్టా సోమశేఖర్, ఎస్డీపీఓ సూర్యదేవర వెంకటేశ్వరరావు, టూ టౌన్ ఎస్హెచ్ఓ డీఎస్ చైతన్యకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఏమరుపాటు వద్దని ప్రజలకు పోలీసుల వినతి
బ్యాంకులు, ఇతర ప్రాంతాల్లో డబ్బు పట్టుకు వెళ్లే వారి దృష్టిని మళ్లించడానికి దుండగులు రకరకాల ఎత్తులు వేస్తారని, అందుకే ఏమరుపాటుగా ఉండరాదని క్రైం డీఎస్పీ సోమశేఖర్ సూచించారు. పరిచయం లేని వ్యక్తులు మాటకలిపేందుకు ప్రయత్నిస్తే వెంటనే విషయం పసిగట్టాలన్నారు. మహిళల మెడల్లో బంగారు ఆభరణాల చోరీకి కూడా ఇదే కారణమన్నారు.
తమిళనాడు, నగరి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ముఠాలు ఇలాంటి చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్నామన్నారు. అనుమానం కలిగేలా ప్రవర్తించే వారి గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వ్యాపారులు అధిక మొత్తంలో ఒంటరిగా సొమ్మును తరలించడం, మహిళలు ఆభరణాలు మెడలో వేసుకుని ఒంటరిగా తిరగడం శ్రేయస్కరం కాదన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more