అనంత లో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి హైదరాబాద్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘోర ప్రమాదం చోటుచేసుకున్న మడకశిర మండలంలోని ప్రమాదఘటనాస్థలికి ఏపీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి బయలుదేరి వెళ్లారు. సంఘటనపై ఆయన దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుల బాధితులను సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.
ఈ ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. బాధితులకు తక్షణం మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని వివరించారు. అటు ఈ ప్రమాదంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త కలచి వేసిందని ఆయన అన్నారు. ప్రమాదంలో పిల్లలు సహా అనేక మంది చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా ఇవాళ మధ్యాహ్నం ఘటనా స్థలానికి ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. మృతుల బంధువులకు సానుభూతి వ్యక్తం చేయడంతో పాటు క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more