ముఖ్యమంత్రి సహా మంత్రులపై బాంబు దాడులకు తెగబడతామని అజ్ఞాత వ్యక్తి హెచ్చరికలు జారీ చేస్తూ బెదిరింపు లేఖను రావడంతో.. పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సహా మంత్రులందరికీ భద్రతను కట్టుదిట్టం చేశారు. అజ్ఞాత వ్యక్తి రాసిన బెదిరింపు లేఖ అరియలూరు రైల్వే స్టేషన్కు రావడంతో దీనిని పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ వేగవంతం చేశారు. అరియలూరు రైల్వే స్టేషన్కు వచ్చిన ఓ లేఖను అక్కడి సిబ్బంది చదివారు. అందులో అరియలూరులోని ప్రధాన వంతెనను పేల్చేస్తామని, మలై కోట్టై ఎక్స్ప్రెస్ను పట్టాలు తప్పించి, బోల్తా కొట్టిస్తామని పేర్కొనడంతో అక్కడి సిబ్బంది ఆందోళనలో పడ్డారు.
అదే లేఖలో మరో వైపుగా మంత్రుల్ని వదలి పెట్టమని, సీఎం పన్నీరు సెల్వం సచివాలయూనికి వెళ్లే సమయంలో రాకెట్ లాంఛర్తో దాడి చేయబోతున్నామని హెచ్చరించడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ లేఖను అందుకున్న రైల్వే పోలీసులు అరియలూరు, తిరుచ్చి ఎస్పీలకు సమాచారం అందించారు. ఈ నెల 13, 14 తేదీల్లో తాము అనుకున్నట్టుగా, ముందుగా వేసిన పథకం మేరకు దాడులు జరిగి తీరుతాయని మోహన్ మురళి శంకర్ పేరును లేఖలో రాసి ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు.
ఆ లేఖ తిరుచ్చిలోని రామలింగపురం నుంచి రావడంతో అక్కడ విచారణను వేగవంతం చేశారు. గత నెల ఇదే చిరునామాతో తిరుచ్చి శ్రీరంగం స్టేషన్కు ఓ బెదిరింపు లేఖ రావడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ లేఖలను పంపిస్తున్న వ్యక్తి ఒకరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పరుగులు తీస్తున్నాయి. ఆ లేఖలో పేర్కొన్నట్టుగా వంతెన వద్ద, మలై కోట్టై రైలు అరియలూరు మీదుగా వెళ్లే ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లాకు చెందిన మంత్రులకు భద్రతను పెంచారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more