They had lunch only

telangana, cheif minister k chandra shekar rao, andhra pradesh chief minister chandra babu naidu, kcr delhi tour, kcr meeting with prime minister, chandra babu nayudu meeting with prime minister

pm meeting with all states chief ministers

ఇద్దరూ కలిసి భోజనం చేశారట...

Posted: 12/08/2014 02:49 PM IST
They had lunch only

నిన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొన్నారు. ఇద్దరికీ ఎవరికీ వాళ్ళు ముఖ్య మంత్రుల సమావేశంలో తమ అభ్యర్థనలు ప్రధాన మంత్రి ద్రుష్టి కి తీసుకెళ్ళారు. ప్రణాళిక సంఘం స్థానంలో ఒక సరిక్రొత్త మార్పు ని తీసుకురావటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. దానికి కావాల్సిన సూచనలను, సలహాలను కూడా ఇచ్చారు.

ప్రధాన మంత్రితో ఇద్దరి సమావేశం ముగిశాక విలేకరుల సమావేశంలో గౌరవనీయులైన ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు మాట్లాడుతూ కెసిఆర్ తో కలిసి భోజనం చేశానని చెప్పుకొచ్చారు. మరి ఇరు రాష్ట్రాల అభివృద్ధి విషయమై ఏమైనా చర్చించారా అని విలేఖరులు అడిగినప్పుడు భోజనం దగ్గర ఎం మాట్లాడతాం కేవలం భోజనం గురించే మాట్లాడామని సెలవిచ్చారు. భోజనం దగ్గర భోజనం గురించే మాట్లాడారంటే  అక్కడ నివ్వేరపోవటం విలేఖరుల వంతయ్యింది. ఏమో ఎం మాట్లాడుకున్నారో ఎంతయినా ఒకప్పుడు ఒకే దగ్గర పని చేసిన పూర్వపు మిత్రులు కదా..!!

హరికాంత్ రామిడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandra babu nayudu  kcr  trs pary  telangana  andhra pradesh.  

Other Articles