తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. తమది మావోల సిద్ధాంతమమనీ., మావోల విధానాలనే ప్రభుత్వం అమలు చేస్తుందని ఇన్నాళ్ళు తెలంగాణ సర్కారు చెప్పుకుంటూ వస్తోంది. అలాంటి ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు అంతా సిద్ధం కావాలని తాజాగా మావోలే హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ పాలన అంతమొందించేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ హెచ్చరికతో ప్రభుత్వ వర్గాలతో పాటు పోలిసులకు కూడా గుబులు పుట్టుకుంది. తెలంగాణలో మళ్ళీ ఒకప్పటి పరిస్థితులు పునరావృతం అవుతాయా అని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
నల్గొండ జిల్లా చౌటుప్పల్ శివారులోని లింగోజిగూడెం, వలిగొండ క్రాస్ రోడ్ దగ్గర మావోల పేరుతో పోస్టర్లు వెలిశాయి. పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీజీఎల్ఏ) పేరుతో బయటపడ్డ ఈ పోస్టర్లలో గెరిల్లా దండు వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వ పాలనను అంతమొందించేదుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలన ప్రజా వ్యతిరేకంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్టర్లపై స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలిసులు ఉన్నతాధికారులకు విషయం సూచించారు. దీంతో చౌటుప్పల్ పరిసరాల్లో గట్టి నిఘా పెట్టారు.
తెలంగాణలో మావోయిస్టులే లేరు అని స్వయంగా హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ప్రకటించిన తర్వాతి రోజే ఈ పోస్టర్లు బయటకు వచ్చాయి. తమది మావోల సిద్దాంతమని ముందునుంచి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో వారే సర్కారుకు వ్యతిరేకంగా బెదిరింపులకు దిగటం గమనార్హం. ఈ పోస్టర్లు చూస్తుంటే విభజనతో తెలంగాణలో మళ్ళీ మావోల సమస్య వస్తుందన్న నాటి ప్రముఖుల మాటలు నిజమన్పిస్తున్నాయి. అటు ఇన్నాళ్లుగా సరిగా భద్రత కూడా లేకుండా గ్రామాల్లో తిరిగిన నేతలు తాజా పోస్టర్లతో బయటకు వెళ్ళాలంటే జంకే పరిస్థితి నెలకొంది.
ఈ పోస్టర్లు మావోయిస్టులు విడుదల చేసినవేనా లేక.. ఆకతాయిలు ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు ఇలా చేశారా అనేది పోలిసుల విచారణలో తేలుతుంది. కానీ ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు రావటం ఆందోళనకరం. ఈ మద్య మావోల పేరుతో వరసగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు వస్తున్నాయి. కొత్త రాష్ర్టంలో అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కుంటున్న కేసీఆర్ సర్కారు ఈ పోస్టర్లపై ఎలా స్పందించనుందో.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more