వీళ్లు పోలీసులేనా..? వీళ్లేనా ప్రజా రక్షకులు, ప్రజలకు శాంతి భద్రతలను అందించాల్సిన వారే.. ప్రజల ప్రాణాలను కబళిస్తున్నారు. ఒకరు డబ్బు కోసం పెద్ద వ్యాపారాలను టార్గెట్ చేసి కిడ్నాపింగ్ యత్నించి ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడకుండా కాల్పులు జరిపితే మరోకరు తాను మోహించిన మహిళపై అత్యాచారానికి పాల్పడాడు. ఇక మరిచోట కొందరు చోక్కాలు విప్పి సినిమా హీరోల్లా ఫోజులిచ్చుకుంటూ.. క్లబ్ లో తెగ డాన్సులు చేస్తున్నారు. సభ్య సమాజానికి రక్షణ నందించాల్సిన వీరు.. తమ విధులు, పరిధులను దాటి ఎందుకు వ్యవహరిస్తున్నారు..?
పోలీసు ఉద్యోగం అంటే ఎంతో గౌరవప్రదమైన ఉద్యోగంగా భావిస్తారు సాదారణ ప్రజలు. తల్లిదండ్రులకు కూడా దడవని పిల్లలు పోలీసులు అనగానే భయపడతాడు. పోలీసులు కోడతారని కాదు. సమాజ పరిరక్షకుడిగా ఆతను తన విధులను ఆచరిస్తాడని. అవసరమైతే నిలదీస్తాడు. అంతకు మించితే వాయిస్తాడని. మరో కోణంలో చూస్తే సంఘ విద్రోహ శక్తుల పాలిట సింహస్వప్నమని, ప్రజా రక్షణలో తీవ్రవాదులు, విద్రోహ శక్తులను ఎదుర్కోంటాడని, వారిని అదుపులోకి తీసుకుంటాడని, తప్పనిసరి పరిస్థితులలో వారి చేతుల్లో అమరుడవుతాడని. కానీ రాను రాను పోలీసులంటే ప్రజల్లో గౌరవం పోతోంది. కొందరు చేసే అకృత్యాలు మొత్తం డిపార్టుమెంటునే అపఖ్యాతి పాలు చేస్తున్నాయి.
దిగువ స్థాయి పోలీసులపై ఉన్నత స్థాయి అధికారులు వాడుతున్న భాషా దోహమమేమో కానీ.. పోలీస్ అంటే దూషణలే అన్న ముద్ర ప్రజల్లో నెలకోంది. వారు వినియోగించే బాషను తట్టుకోవడం, వారు అనుమానించే విధంగా వెటకారంగా ప్రశ్నలు సంధించడంతో.. సామాన్య ప్రజలు సోలిస్ అంటేనే అమాడ దూరం వుంటారు. తప్పని సరి పరిస్థితులలో మాత్రమే పోలిస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు. సర్వసాదారణంగా అందరినీ అనుమానించే పోలీస్ స్టేషన్ కు వెళ్లగానే సెంట్రీ దగ్గరి నుంచి హుకరింపులు మొదలవుతాయి. ఏదైనా చిన్నపాటి తప్పు చేసి పట్టుబడితే.. ఇకేమైనా వుందా.. వారి నోటి నుంచి వచ్చే సంస్కృతాన్ని తట్టుకోవడం సంస్కార వంతులకైతే సాధ్యపడదు.
వ్యవస్థ క్రమంగా మారుతోంది. సినమాల్లో చూపించినట్లు ఉన్నతాధికారి ఇళ్లలో సేవలు చేసే కానిస్టేబుళ్లు, హోంగార్డలు ఇప్పడు మచ్చకు కూడా కనిపించడం లేదు. అంటే తరంతో పాటు పోలిసు యంత్రాంగం కూడా ఉన్నతాధికారుల నుంచి మారుతుందన్నది అక్షర సత్యం. అయితే పోలిస్ శాఖ నుంచి దూషణ పర్వాన్ని తొలగించేందుకు కూడా అధికారులు చర్యలు చేపడతున్నారు. ఇప్పుడిప్పుడే అచరణలోకి వస్తున్న వాటి ఫలాలు ప్రజలకు అందాలంటే కొంత సమయం పడుతుందన్నట మాట వాస్తవం. అయితే ఏళ్ల సయమం తీసుకుంటే మాత్రం ప్రజలకు మరికోన్నాళ్ల పాటు ఇబ్బందులు తప్పవు.
పీపుల్ పోలిస్ అనే పదానికి అర్థం తెచ్చేలా వ్యవహరించాల్సిన పోలీసులు మొత్తం పోలీసు వ్యవస్థకే అపకీర్తిని తీసుకురావడంతో పోలీసులంటే ప్రజల్లో వున్న పూర్వ వైభవం రావడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో.. వేచి చూడాల్సిందే. అయితే దిగువ శ్రేణి పోలీసుల జీతబెత్యాలు కూడా ఇప్పడు చాలా మెరుగయ్యాయి. ఒకప్పటితో పొల్చితే.. ఇప్పడున్న జీవన వ్యయానికి సరిపోనూ వేతనాలు అందుతున్నాయి. అయినా డబ్బు కోసం దారుణాలకు ఒడిగట్టడమేంటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
నగరం నడిబొడ్డున, ప్రశాంతమైన వాతావరణాన్ని కాల్పుల మోతలతో ఘటన కలకలం సృష్టించింది. కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన ఏ ఆర్ కానిస్టేబుల్ ఓబులేసు చర్యలో ఒక్కసారిగా రాష్ట్రం ఉల్కికి పడింది. ఇక తమ శాఖకు చెందిన కానిస్టేబుల్ ఇలాంటి ఘటనకు పాల్పడమేంటని అతని సహచరులే చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ మన పోలీసుల ఘనతను కూడా చాటిచెప్పాల్సి వుంది. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడిని 24 గంటల్లో పట్టుకుంటామన్నారు. అన్నట్లుగానే 24 గంటల్లో కేసును చేధించి.. శభాష్ అనిపించుకున్నారు. తీవ్ర సంచలనం రేపిన ఘటనను అంతే త్వరగా దర్యాప్తు చేశారు.
ఈ ఘటనను మరువక ముందే పశ్చిమ బెంగాల్ లో మరో ఘటన చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో బెల్డా గ్రామంలో ఓ గృహిణిపై కీచక పర్వానికి తేరలేపాడు ఒక కానిస్టేబుల్. తాను మనస్సు పడిన ఆ గృహిణిని టార్గెట్ చేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయాన్ని చూసి.. దుశ్యాసనుడిలా అమెపై పడ్డాడు. బాధితురాలు గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు అతడిని పట్టుకుని చితక్కొట్టి ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిఖిల్ మండల్ అనే కానిస్టేబుల్ ను పోలీసులు అత్యాచారం కేసు కింద అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని మిడ్నాపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ వందనా వరుణ్ చంద్రశేఖర్ తెలిపారు.
ఇక మరో ఘటనలో సినిమా పోలీసుల్లా వ్యవహరించి డాన్సులు వేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనమిది మంది కానిస్టేబుళ్లు చోక్కాలు విప్పి మరీ హోటల్ లో డాన్సులు చేశారు. తమలోని నాట్య ప్రతిభను కనబర్చారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇంకేముంది ఉన్నతాధికారులకు సమాచారం అందింది వెంటనే వారిని సస్సెండ్ చేశారు. వివేక్ చవాన్, సూరజ్ తోమార్, సౌరభ్ కుమార్, సందీప్కుమార్, దేందియాల్ సింగ్, హితేష్ ఛౌదురి, సచిన్ మాలిక్, హేమంత్ భాటి అనే కానిస్టేబుళ్లను ఇవాళ సస్పెండ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీరంతా క్రమశిక్షణారహితంగా ఓ హోటల్లో ఈ నెల 15వ తేదీన చొక్కాలు విప్పి డ్యాన్సులు చేశారంటూ ఎస్పీకి ఫిర్యాదు అందింది. ఈ మేరకు విచారణ జరిపిన ఉన్నతాధికారులు వారిపై క్రమశిక్షణా చర్యలకు పూనుకున్నారు.
ఈ ఘటనలతో అక్కడ ఆ ఘటన జరిగింది.. ఆయనకు ఫలానా పోలీసు అధికారే సహకారం అందించాడట.. ఇక్కడ ఈ ఘటన జరిగింది.. ఏకంగా పోలీస్ కానిస్టేబులే అందులో నిందితుడట.. ఫలానా చోట ఫలానా ఘటన, ఫలానా పోలిస్ అనే మాటలు ప్రజలు చర్చించుకుంటుంటే.. వీళ్లేనా పోలీసులు.. ఇదేనా వీరు వ్యవహరించాల్సిన తీరు అని అనిపించక మానదు. ఎక్కడ ఏ ఘటన జరిగింది..? ఏ కానిస్టేబుల్ ప్రమేయముంది అన్నది ప్రశ్న కాదు. ఎ ఏ అధికారుల పాత్ర వుందన్నది కూడా ప్రశ్న కాదు. బాధ్యతాయుతమైన ప్రజారక్షణా విభాగంలో పోలీసులుగా విధులు నిర్వహిస్తూ.. నేరస్థులను కటకటాల వెనక్కి నెట్టాల్సిన వీరే.. ఎందుకు నేర ప్రవృత్తికి ఆకర్షితులవుతున్నారన్నదే ప్రశ్న.
ప్రజా రక్షణ తమ భాద్యతని తెలిసి కూడా ప్రజలను టార్గెట్ చేసి, క్రమశిక్షణా రాహిత్యంతో ఎందుకు మెదులుతున్నారన్నది కూడా ప్రశ్న. నేర ప్రవృత్తి కలిగిన వారిని చూసి, చూసీ.. కరుడు గట్టిన వీరు అలా తయారవుతున్నారు. వారి పడే శిక్షలను వీరు చూడటం లేదా అన్న సందేహం కూడా కలుగుతోంది. నేరప్రవృత్తిలో బాగా రాణించి, పెద్దమనుషులు అండదండలతో ఒట్టి కాళ్లతో తిరిగిన వ్యక్తుల పోలీసులకు దోరకకుండా కారులో తిరిగే స్థాయి చూసి తాము అలా కావాలనుకుంటే.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే అవుతుంది కదా.. శిశుపాలలను చూసి మనమూ వంద తప్పులను చేయవచ్చు అనుకోవడం తప్పు. శిశుపాలునికే ఆ వరం దక్కింది. అలా అని అందరికీ దక్కదు. కానీ వందో తప్పు చేసిన శిశుపాలుడు ఏ మయ్యాడు అన్నది కూడా గ్రహిస్తే తప్పులు జరగకుండా బాథ్యాతాయుతంగా మెలుగుతారని ఆశిస్తున్నాం..
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more