ప్రస్తుత ప్రపంచం మనుషులతో పాటు రోబోలతో కూడా నడుస్తోంది. హైటెక్ టెక్నాలజి పుణ్యమా అని రోబోలు అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇంటి పనులు మొదలుకుని షాపుల్లో హౌజ్ కీపింగ్ సెక్షన్ , హోటళ్ళలో సర్వర్లుగా సేవలు అందిస్తున్నాయి. తాజాగా ఈ రోబోలు సెక్యురిటి గార్డు విధులు కూడా నిర్వర్తిస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సిలికాన్ వ్యాలిలో రోబోలు సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్నట్లు ప్రముఖ వెబ్ సైట్ తెలిపింది. ఐదు అడుగుల పొడవైన ఈ రొబోలు పోలిసుల కంటే మరింత పకడ్బందీగా భద్రతను అందిస్తున్నాయని కధనంలో పేర్కొంది.
ప్రతి సెక్యురిటి రోబో అత్యాధునిక లేజర్ స్కానర్లు, కెమెరాలు, మైక్రో పోన్ లు కలిగి ఉంది. ఫలితంగా చుట్టూ ఉండే పరిస్థితులను గమనించటంతో పాటు, బాంబులు వంటి పేలుడు పధార్ధాలను స్కానర్లు గుర్తిస్తాయి. ఇక మైక్రోఫోన్లు సమాచార చేరవేతలో ఉపయోగపడతాయి. కెమెరాల సాయంతో రోబో నిరంతరం స్థానిక పరిసరాలను వీడియో తీస్తుంది. ఫలితంగా అనుమానితులను గుర్తించటం సులభం అవుతుందని తయారీదారులు చెప్తున్నారు. నైట్ స్కోప్ పేరుతో పిలిచే ఈ రోబోలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చేయటం మరో విశేషం.
ఈ రొబోలు మనుషుల్లాగే వినటం, చూడటంతో పాటు భావాలను గుర్తించగలవట. వీటిలో ప్రత్యేకంగా జీపీఎస్ టెక్నాలజీ పొందుపర్చారు. అంతేకాకుండా వేడిని గ్రహించే సెన్సార్లు ఉన్నాయి. ఫలితంగా అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే పసిగట్టేస్తుంది. ప్రస్తుతం సిలికాన్ వ్యాలిలో ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ రోబోల ఫలితాలు మెరుగ్గా ఉంటే త్వరలోనే షాపింగ్ మాల్స్, కార్యాలయాలు ఇతర ప్రాంతాల్లో ఉపయోగించే అవకాశం ఉంది. వీటి వల్ల నేరాల సంఖ్య 50శాతం తగ్గుతుందని వీటిని తయారుచేసిన శాస్ర్తవేత్తలు చెప్తున్నారు. ఇలాంటి రోబోలు కాలనీల్లో సెక్యురిటీ గార్డులుగా ఉంటే దొంగలు, దుండగుల దాడి భయం ఉండదని సిలికాన్ వ్యాలీ వాసులు చెప్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more