నల్లధనంకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడి మరో గొప్ప విజయం సాధించాడు. ప్రపంచ వేదికలపై ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించటం ద్వారా అందర్నీ ఆలోచింపచేసి.. చివరకు తన వైపు నడిచేలా చేసుకున్నాడు. నల్లధనంపై సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు జీ20 దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు మోడి ప్రసంగ విజ్ఞప్తులను అంగీకరిస్తూ సదస్సుకు హాజరైన దేశాల నేతలు ప్రతిన కూడా చేశారు. ఇప్పటికే నల్లధనంపై ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, విదేశాల నుంచి నల్ల కుభేరుల జాబితా తెప్పించి వారికి ఇచ్చిన మోడికి ఇది మరొక విజయంగా చెప్పవచ్చు.
ఆస్ర్టేలియాలోని బ్రిస్బేస్ లో జరిగిన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్రమోడి నల్లధనం, ఉగ్రవాదం అంశాలపైనే ప్రధానంగా ప్రసంగించారు. నల్లధనం భారత్ కు ప్రధాన అవరోధంగా ఉందన్నారు. దీన్ని అధిగమిస్తామని., అయితే ఈ విషయంలో అన్ని దేశాల సమన్వయం కావాలని కోరారు. సమావేశాల చివరి రోజున మోడి ప్రసంగంపై స్పందిందిచిన జీ20 దేశాలు నల్లధనంపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు కొత్త ప్రమాణం తీసుకువస్తామని చెప్పాయి. దీంతో 2017 నాటికి పన్ను సమాచారం ఆటోమేటిక్ గా ఇచ్చిపుచ్చుకునేందుకు యంత్రాంగం ఏర్పాటుకానుంది.
దీంతో పాటు బేస్ ఎరోజన్, ఫ్రాఫిట్ షేరింగ్ ఎదుర్కునేందుకు కార్యాచరణ ప్రణాళికకు కూటా అంగీకారం తెలిపింది. 2017 లేదా 2018 నాటికి జీ20 లోని దేశాలో పాటు ఇతర దేశాలు కూడా సీమాంతర పన్ను ఎగవేత నిరోధించేందుకు సమాచారం ఇచ్చిపుచ్చుకునే విధానం మొదలు పెడతామని తీర్మానం చేశాయి. దీనిపై జీ20 నుంచి అధికారిక ప్రకటన వెలువడంది. ఎవరైతే, ఏ దేశంలో అయితే ఆదాయం సృష్టిస్తారో, ఆ దేశానికి సంబంధించిన పన్ను ఎగవేతలపై సమాచారం ఇస్తారు. తద్వారా మనకు తెలియకుండా ఇతర దేశాల్లో డబ్బు దాచుకున్న వారి వివరాలు ఆ దేశాలు స్వయంగా భారత్ కు అందిస్తాయి. ఇలా చేయటం వల్ల నల్లధనంను సులువుగా అరికట్టవచ్చు. స్వాతంత్ర్య పోరాటంలో ఎందరు వచ్చినా.., చివరకు అంతా గాంధీ వెనకే నడిచినట్లుగా.., అవినీతి, నల్లధన పోరులో ఎంతమంది ఉద్యమకారులు వచ్చినా.. ఇప్పుడు ప్రపంచమే మోడి వెనక నడుస్తూ ఆయనకు అండగా ఉంటోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more