డబ్ల్యుటిఒలో సంపన్న దేశాల మొండి వైఖరిపై అలుపెరుగని పోరాటంలో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. వర్థమాన దేశాల ఆహార నిల్వలపై సంపన్న దేశాల వైఖరిని నిరసిస్తూ భారత్ ధ్వజం ఎత్తడంతో డబ్ల్యుటిఒ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆహార భద్రత విషయంలో ఏర్పడిన ఈ విభేదాలను పరిష్కరించుకుంటూ భారత్, అమెరికా ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న వాణిజ్య దోహద ఒప్పందం (టిఎఫ్ఎ) అమలుకు మార్గం సుగమం అయింది. భారత, అమెరికాల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఆహార భద్రత విషయంలో డబ్ల్యుటిఒలో ఒక శాశ్వత పరిష్కారం సాధించే వరకు భారతదేశం ఎలాంటి అవరోధాలు లేకుండా ఆహార భద్రతా కార్యక్రమాలను కొనసాగించుకోవచ్చు.
బాలి ఒప్పందం ప్రకారం డబ్ల్యుటిఒ సభ్య దేశాలు ఏ ఇతర డబ్ల్యుటిఒ ఒప్పందాల వల్ల అయినా సవాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడితే వాటికి చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. ఈ రక్షణ 2017 వరకు అమలులో ఉంటుంది. ఆహార భద్రత స్కీమ్ల అమలు కోసం ఆహార ధాన్యాల నిల్వలు నిర్వహించుకునే విషయంలో భారత్కు స్వేచ్ఛ ఇస్తూ ఒక ఒప్పందం కుదిరిందని, దీంతో టిఎఫ్ఎ అమలుకు మార్గం సుగమం అయిందని భారత వాణిజ్య/పరిశ్రమల శాఖ సహా య మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్లో అమెరికా పర్యటనలో జరిపిన ద్వైపాక్షిక చర్చలే ఈ ఒప్పందం కుదిరేందుకు మూలమని ఆమె అన్నారు.
ప్రధాని పర్యటన అనంతరం భారత్లో వాస్తవ పరిస్థితిపై అమెరికా యంత్రాంగంలో ఒక అవగాహన ఏర్పడిందని ఆమె చెప్పారు. గత జూలైలో బాలి సదస్సులో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయి టిఎఫ్ఎ ముందుకు కదిలే అవకాశం ఏర్పడిందని అమెరికా వాణిజ్య ప్రతినిధి మైకేల్ ఫ్రోమాన్ అన్నారు. వ్యవసాయ సబ్సిడీల పరిమితిని మదింపు చేసే విధివిధానాల్లో అవసరమైన మార్పులు చేయడం వల్ల కనీస మద్దతు ధరలు చెల్లిస్తూ వ్యవసాయదారుల నుంచి ఆహారధాన్యాలు సేకరించి తక్కువ రేట్లకు పేదలకు ఆహారధాన్యాలు అందించగలుగుతామన్నది భారత్ వాదం. ప్రస్తుత డబ్ల్యుటిఓ నిబంధనల ప్రకారం మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి విలువలో పది శాతం వరకు ఆహార సబ్సిడీలు ఉండవచ్చు. కాని ఈ మదింపునకు రెండు దశాబ్దాల నాటి ధరలను బెంచ్మార్క్గా తీసుకుంటున్నారు. దీని వల్ల భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆహర భద్రతా పథకాలు పూర్తి స్థాయిలో అమలు పరిచే నాటికి వాస్తవ విలువ ఈ పదిశాతం పరిమితి దాటిపోతుంది. అలా దాటితే డబ్ల్యుటిఓ నిబంధనల ప్రకారం పెనాల్టీ చెల్లించాల్సివస్తుంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more