ఆ రెండు దాయాది దేశాలు అడుతున్నాయంటే చాలు అది ఏ ఆటైనా పోరు రసవత్తంగా వుంటుంది. ఆటను వీక్షించేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తారు. మరి అదే క్రికెట్ అనుకోండి ఇసుకేసినా రాలనంత జనం వచ్చేస్తారు. అయితే అంత మంది జనాన్ని రానిస్తారా..? అనేగా మీ డౌట్.. కాదండి.. అంతలా జనం వస్తారని ఉదాహరణకు చెప్పాం. స్టేడియంలోని సీట్ల సంఖ్యను బట్టే అధికారులు టిక్కెట్లను విక్రయిస్తారు. అంతా చెబుతున్నారు ఇంతకీ ఎవరెవరకి మధ్య మ్యాచ్, ఎందులో క్రీడా విభాగంలో జరుగుతుంది అన్న సమాచారం చెప్పమంటారు అంతేగా..
దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ల జట్ల మధ్య క్రికెట్ మ్చాచ్ అంటే ఎంత క్రేజ్ అన్నది మాటల్లో చెప్పలేం. అదీ వరల్డ్ కప్ అయితే.. ఇక ఆ క్రేజ్ కు అది అంతమూ వుండదు. మరి ఈ మ్యాచ్ ను వీక్షించాలంటే టిక్కట్లు దోరుకుతాయా..? అసలు దోరకవ్.. నిజమండీ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న జరగనున్న వరల్డ్ కప్ లో భాగంగా అస్ట్రేలియాలోని అడిటైడ్ లో జరగనున్న భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జనరల్ టిక్కెట్లను ఇవాళ విక్రయించారు. టిక్కెట్ బుకింగ్ ప్రారంభించిన 12 నిమిషాలలోనే టిక్కెట్లన్నీ అమ్ముడైపోయాయి. వేల సంఖ్యలో టిక్కెట్లు 12 నిమిషాలలో అమ్ముడవ్వడంతో దక్షిణ అస్ట్రేలియా ప్రభుత్వాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత్, పాకిస్థాన్ మ్యాచులకు వున్న డిమాండ్ వారి నివ్వెరపర్చింది.
ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు సుమారు 20 వేల మంది భారతీయులు అస్ట్రేలియాకు వస్తారని దక్షిణ అస్ట్రేలియా ప్రభుత్వ అంచనా వేస్తోంది. ఒవల్ లోని అడిలైడ్ లో జరగనున్న ఈ మ్యాచ్ కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే ఇవాళ ప్రారంభించిన టిక్కెట్ల విక్రయాలలో ఈ మ్యాచ్ కు సంబంధించి 50 వేల జనరల్ టిక్కెట్లనీ అమ్ముడయ్యాయని అధికారులు చెప్పారు, అయితే క్రికెట్ అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, హాలిడే, బిజినెస్ ప్యాకేజ్ లలో టిక్కెట్ల విక్రాయాలు జరపలేదని దక్షిణ అస్ట్రేలియా ప్రభుత్వాధికారులు చెప్పారు.
ఆడిలైడ్ లో తాము కొత్తగా నిర్మించిన స్టేడియంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తోనే అంకురార్సణ జరుగుతుండటం విశేషమన్నారు. ఈ శుభముహూర్తం ఎప్పుడు వస్తుందా అంటూ తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ తో తమ స్టేడియం నిండుకుండాలా తలపిస్తుందన్నారు. ఎంతో మంది భారతీయ, పాకిస్థానీ క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు ఇక్కడకు రానున్నారని చెప్పారు. ముఖ్యంగా భారత్ నుంచి ప్రత్యేకంగా ఈ మ్యాచ్ వీక్షించేందుకు 20 వేల మంది అడిలైడ్ కు వస్తారని తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
2015 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభమైన రెండో రోజు భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయని తెలిపారు. ఈ మ్యాచ్ కు అన్ని రకాల భద్రత, వీక్షకుల భద్రతలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఈ గ్రౌండ్ నాలుగు మ్యాచులకు వేదిక కానుందని దక్షిణ అస్ట్రేలియా ప్రభుత్వఅధికారి తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more