మలేషియాలో మనుషుల బానిసత్వ మాఫియా రాజ్యమేలుతోంది. నమ్మడం లేదా.. ఇదిగో ఈ కుర్రాడిని చూడండి.. ఇతని పేరు లోకేష్ సపాలిగ, మాఫియా చేతుల్లోంచి 25 రోజుల తరువాత సాహసోపేతంగా తప్పించుకుని వచ్చిన ధైర్యశాలి. ఉద్యోగం కోసం వెళ్లి మాఫియా చేతుల్లో చిక్కి, నరకయాతన అనుభవించాడు. నాలుగు వందల రూపాయల కోసం సుమారు రోజులు 20 గంటల వరకు పని చేశాడు, నిద్రకు కరువయ్యాడు. ఇక తప్పదనుకున్నాడు. అంతే మలేషియాలోని ఆలియ్ రిగ్ నుంచి తప్పించుకుని.. చిమ్మ చీకట్ల నడుమ.. బతుకు జీవుడా అంటూ అడవిలోంచి పారిపోయి వచ్చాడు. ముంబైకి చేరుకోగానే అతను తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు తెచ్చుకోడానికి కూడా సాహసించలేదు. హమయ్య అనుకున్నాడు. నమ్మకం కలగిందా.. లేదా..? అయితే పూర్తి వివరాలు తెలుసుకోండి..
గల్ఫ్ దేశాల్లో ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్న లోకేస్ .. తనకు ఇంకా మంచి ఉద్యోగం కావాలని ప్రతిరోజు పత్రికలలో ప్రకటనలు చూసేవాడు. అలా చూడాగా, అతనికి మలేషియాలో షిప్ పై పనిచేసే అవకాశాలు వున్నాయన్న ప్రకటన ఆకర్షించింది. ఈ ప్రకటన పోస్ట్ చేసింది ముంబాయిలోని నల్లాసపరలో వున్న రామ్ సఫోర్ట్ సర్పీసెస్ అనే ప్లేస్ మెంట్ ఏజెన్సీ. ఏజెన్పీకి ప్రోఫెటర్ నరేంద్ర కుమార్ యాదవ్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. అతనికి కౌలాలంపూర్ లోని ఆయిల్ రిగ్లో ఉద్యోగ్యం ఇప్పిస్తానని నమ్మబలికాడు. వేతనం కూడా 60 నుంచి 70 వేల వరకు వుంటుందని చెప్పాడు. దాంతో ధనాశకు లోంగిన లోకేస్..తనకు ఉద్యోగాన్ని ఖాయం చేయాల్సింది కోరారు. గల్ఫ్ లో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని లోకేష్ ముంబైకి వచ్చాడు. యాదవ్ తో మాట్లాడుకున్న ఒప్పందం మేరకు ఆయనకు వీసా, తదితర ఖర్చుల కింద లక్ష 70 వేల రూపాయలు ఇచ్చాడు.
అనుకున్నట్లుగానే సెప్టెంబర్ 19న కౌలాలంపూర్ కు బయలుదేరాడు. తన వీసాతో కౌలాలంపూర్ లోని ఓడపై గల అయిల్ రిగ్ లో పనిచేయడానికి అని రాసి వుండటంతో అసలు ఎలాంటి అనుమానాలు లేకుండా విమానం ఎక్కాడు. అయితే అయిల్ రిగ్ లో పనిచేస్తే ఇంత భారీగా జీతాలు ఎందుకిస్తారు అన్న అనుమానం మాత్రం అతనిలో ఏదో మూల నెలకొంది. తన అనుమానాలన్నింటినీ పక్కన బెట్టి చూసేసరికి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వచ్చేసింది. అక్కడకు చేరుకోగానే రాజ్ కరణ్ వర్మా అనే సబ్ ఏజెంట్ అతనిని కారు డిక్కిలో ఎక్కించుకుని మలేషియాలోని మానవ బానిసత్వ మాఫియాకు విక్రయించాడు.
ఇదంతా అర్థమయ్యేప్పటికి..ఇక తన కథ అక్కడితో ముగిసిందనుకున్నాడు లోకేష్.. ఇంకేముంది మాఫియా చెప్పినట్టు వినాల్సిందే.. మాఫియా లోకేష్ ను అక్కడి దూరంగా సిబులోని అటవీప్రాంతంలో వున్న ఎస్.డీ.ఎన్.బీహెఛ్.డి అనే ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లారు. అక్కడ తనలాగే వందలాది మంది భారతీయులు, నేపాలీయులు, పలువురు ఇతర దేశాల వారు వున్నారు. వారందరినీ చూసి షాక్ అయ్యాడు. కొన్ని రోజులు పనిచేశాడు. ప్రతీ రోజు 18 నుంచి 20 గంటల పనిచేయాల్సిందే. గాయాలైనా, వారు ఉపేక్షించరు. శరీరం సహకరించకపోయినా పనిచేయాల్సిందే. కనీసం నిద్రకూడా ఉండేది కాదు. అయితే ఈ దురాఘతాలపై పిర్యాదు చేయడానికి వెళ్లే వారిని వారు చితకోట్టి మూలన పడేశారని సహచరులు చెప్పారు.
దీంతో ఆలా చేయడానికి సాహపించలేక నిమ్మకున్నాడు. వారు పెట్టే బోజనంలో క్రీములు దర్శనమిచ్చేవి. ఇదేమిటని అడిగితే.. ఇక తమకు మరోసారి అన్నం కూడా పెట్టరని తెలియడంతో క్రీములను తోలగించి అన్నం తిన్నాడు. అంతే కాదు తమకు పడుకోడానికిచ్చే దుప్పట్లు, పరుపుల్లో నల్లులు వున్నాయన్నాడు. అయినా అలసటో నిద్రపట్టేదని, అంతలోనే లేపి మళ్లీ పనులకు వెళ్లమని మాఫియా పురమాయించేదని చెప్పాడు. ఒక్కో గదిలో ఒక్కటే ఫ్యాన్ వుండేదని, దాని కింద 15 నుండి 20 మంది పడుకునే వరాని, ఫ్యాను గాలి కోసం వారంతా పోటీ పడాల్సిన పరిస్థితి వుందని చెప్పాడు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందించకుండానే రాత్రి వేళ్లలో కూడా పనిచేయించేవారని చెప్పాడు.
అలా కొన్నాళ్లు పనిచేసిన లోకేష్.. చివరకు ఒక వ్యక్తికి లంచం ఎరగా వేసి అతని మొబైల్ సహకారంతో కౌలాలంపూర్ లో తాను ఎదురుకుంటున్న పరిస్థతిని తన బావ ప్రకాష కర్కేరాకు వివరించాడు. ప్రకాస్ నేరుగా నల్లసొపరలోని ఏజెంట్ వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. అయితే బాధపడాల్సిందేమీ లేదని లోకేష్ క్షేమంగా తిరిగి రప్పిస్తానని ఏజెంట్ నరేంద్ర కుమార్ యాదవ్ చెప్పాడు. పోలీసులకు పిర్యాదు చేస్తే తన ఏజెంట్ వర్మ ద్వరా లోకేష్ ను అక్కడే అంతమెందిస్తానని బెదిరించాడు. కొన్ని రోజులు పాటు వేచి చూసిన ప్రకాష్ ఇక లాభం లేదని తాను పోలసులకు సమాచారం ఇస్తానని బెదిరించడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో చర్యలకు ఉపక్రమించాడు. తన ఏజెంట్ వర్మ ద్వరా లోకేష్ ను రప్పించేందుకు ప్లాన్ చేశాడు.
వర్మతో లోకేష్ కు ఫోన్ చేయించాడు. తాను ప్యాక్టరీకి అనుకుని వున్న అటవీ ప్రాంతాని దాటుకుని వస్తే.. పాస్ పోర్టు.. వీసాలతో వెళ్లేందుకు ప్లేన్ టిక్కట్లు ఇస్తానని, ఇంతకంటే మరే సాయం చేయలేనని చెప్పాడు. దాంతో ఆ రోజు రాత్రి అందరు నిద్రిస్తుండగా లోకేస్ ప్యాక్టరీ నుంచి వేకువ జామున తప్పించుకుని అటవీ ప్రాంతంలోకి చేరుకున్నాడు. అక్కడి నుంచి చిమ్మ చీకట్లలో నడుస్తూ, పరిగెడుతూ.. ఎట్టకేలకు హైవేపైకి చేరుకున్నాడు. అక్కడ వర్మ అతనిని కలసి ఓ డాక్యూమెంట్ పై సంతకం చేయించుకున్నారు. ఆ తరువాత లోకేష్ కు వీసా, ప్లేన్ టిక్కెట్, పాస్ పోర్టు ఇచ్చారు. ఆ రోజు రాత్రి కౌలాలంపూర్ చేరుకుని మరుసటి రోజున ముంబై విమానం ఎక్కి ఇండియాకు చేరుకున్నాడు లోకేష్.
తనకు ఎలా మాఫియాకు విక్రయించింది, ఎలా తనను మెసం చేసింది అంతా పోలీసులకు పిర్యాదు చేశాడు. సదరు రామ్ సఫోర్ట్ సర్పీసెస్ అనే ప్లేస్ మెంట్ ఏజెన్సీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఏజెన్పీకి ప్రోఫెటర్ నరేంద్ర కుమార్ యాదవ్ ఆ రోజు నుంచి పరారీలో వున్నాడని పోలీసులు తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని, వారి ఆదేశాల ప్రకారం కేసు దర్యాప్తు చేస్తామంటున్నారు పోలీసులు ఇది లోకేష్ కు జరిగిన అనుభవం. ఇప్పటికైనా నమ్ముతారా మానవ బానిసత్వ మాఫియా.. మలేషియాలో రాజ్యమేలుతోందని, తస్మాత్ జాగ్రత్త.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more