బంగాళాఖాతంలో ఏర్పడిన హుదుద్ తుపాను పెనుతుపాను మిగిల్చిన గాయాలను నుంచి ఇంకా తేరుకోని కోస్తాంత్ర తీర ప్రజలపై ప్రకృతి మరోమారు పంజా విసిరేందుకు సిద్దంగా వుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడి.. తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాదులోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనాలు ఉద్ధృతంగా ఉండడంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తొలుత వెల్లడించారు.
అయితే ఉపరితల ఆవర్తనాలు బలహీనపడడంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం లేదని శనివారం తేల్చి చెప్పిన అధికారులు మరో బాంబు పేల్చారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో మాత్రం అల్పపీడనం ఏర్పడడానికి, అది బలపడి తుపానుగా మారడానికి అక్కడి వాతావరణం అత్యంత అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడినందున ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఆదివారం రాత్రి వరకు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాగల 24గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడా చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉందిన అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, రాయలసీమ, ఉత్తర కోస్తా, తెలంగాణల్లో అక్కడక్కడా చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఎండలు ఠారెత్తిస్తుండగా, రాత్రిపూట చలి వణికిస్తోంది. తెలంగాణలో సాధారణం కంటే 4, కోస్తాంధ్రలో 3, రాయలసీమలో 2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో మెదక్, ఆదిలాబాద్లలో కనిష్ఠంగా 15డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వటం గమనార్హం. ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నందున క్రమంగా రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశముంది. దీని వల్ల చలిపులి మరింత వూపందుకోనుందని అధికారులు అంచనావేస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more