దేశాన్ని ఏకీకృతం చేయడానికే ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్పటేల్ జీవితం అంకితం చేశారని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పటేల్ జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని చెప్పారు. సర్దార్ వల్లభాయ్పటేల్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్చౌక్ వద్ద నిర్వహించిన జాతీయ ఏక్ తా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పటేల్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... దేశాన్ని ఐక్యంగా ఉంచే క్రమంలో సర్దార్ పటేల్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. స్వాతంత్య్ర అనంతరం దేశంలోని సంస్థానాల వీలినమే పటేల్లో ఉన్న దేశ ఐక్యతకు నిదర్శనమని చెప్పారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో రైతులందరినీ ఏకతాటిపై నడిపిన ఘనత పటేల్దేనని కొనియాడారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన దండియాత్ర. భారతదేశ స్వంతంత్ర కాంక్ష, శక్తిని చాటిందని, ఈ యాత్రలో మహాత్ముడితో కదం కదం కలిపి నడిచిన వ్యక్తి పేటల్ అని ఈ సందర్బంగా ప్రధాని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచనలతో ముందు కెళ్లాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వస్తే దేశం ముక్కలైపోతుందని బ్రిటీష్ వారు భావించారు... కానీ దేశమంతటినీ ఒక్కతాటిపై నిలిపిన మహనీయుడు పటేల్ అని కీర్తించారు. దేశంలో జరిగిన అనేక కుట్రను ఉక్కుపాదంతో అణిచిన వ్యక్తి పటేల్ అని తెలిపారు. సంస్థానాల విలీనమే పటేల్ శక్తి సామర్థ్యాలకు ప్రతీక అని కొనియాడారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, రవిశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. . అనంతరం ఐక్యమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని మోదీ ఈ సందర్భంగా విజయ్చౌక్ వద్ద పాల్గొన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ఐక్యత పరుగును జెండా ఊపి మోదీ ప్రారంభించారు. ఈ పరుగులో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఐక్యతా దివాస్ సందర్భంగా మోడీ తన ప్రసంగంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గుర్తు చేసుకున్నారు. దేశానికి స్పూర్తిదాయకమైన పటేల్ జన్మదినం రోజునే దేశ ప్రధానిని అమె భద్రతా బలగాలు బలి తీసుకోవడం దురదృష్టకరమన్నారు. అయితే ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన అల్లర్లు ఒక వర్గంపై జరిగిన దాడులు కాదని, యావత్ దేశ ప్రజలపై జరిగిన దాడులుగా ప్రధాని అభివర్ణించారు..
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more