విదేశీ బ్యాంకుల్లో కోట్ల కొలది డబ్బును దాచిన భారతీయ నల్లకుభేరులు జాతకాలకు ఎట్టకేలకు బట్టబయలయ్యాయి. దేశ సరిహద్దులను దాటించి అక్రమంగా డబ్బు నిల్వచేసిన నలధన కుబేరులను వెనకేసుకురావద్దని సుప్రీంకోర్టు తెగేసి చెప్పడంతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వారి జాబితాను బయటపెట్టింది. గత కొన్ని ఏళ్లుగా నానుతున్న నల్లకుబేరుల అంశంలో కేంద్రప్రభుత్వం అడుగుముందేకేసింది. విదేశాలలోని అక్రమంగా సొమ్మును దాచిన మొత్తం 627 మంది పేర్లతో కూడిన ఈ జాబితాను అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు సర్కారు సమర్పించింది. 120 కోట్ల మంది భారతీయులకు.. సువిశాలమైన భారతదేశ అభివృద్దికి దోహదపడాల్సిన సోమ్మును.. సప్తసముద్రాలు దాటించిన ఘనుల జాబితాలో పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్యవేత్తల సహా.. ఇలా అన్ని వర్గాల వాళ్లు ఉన్నారు. దీంతో ఇప్పడు వారి గుండెళ్లో రైలు పరిగెడుతున్నాయి. అందరూ వేలకోట్లలోనే తమ సంపదను విదేశాల్లోని పలు బ్యాంకుల్లో వేర్వేరు ఖాతాలలో దాచిపెట్టుకున్నారు.
అయితే.. మన దేశానికి చెందిన సొమ్ము విదేశాలకు ఇలా తరలిపోవడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, దీనిపై ఎలా దర్యాప్తు చేయించాలో తమకు తెలుసునని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. జాబితా మొత్తాన్ని.. ఒక్క పేరు కూడా తీయకుండా తమకు సమర్పించాలని అదేశించడంతో.. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ జాబితాను అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించారు. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ పేర్లను బయటపెట్టొద్దని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
భారతదేశంలో వేల సంఖ్యలో నల్లకుబేరులు ఉండగా, కేవలం 627 మంది పేర్లనే కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన 627 మంది నల్లకుబేరుల జాబితా మొత్తం ఫ్రాన్స్ లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉన్న ఖాతాల వివరాలు మాత్రమేనట. ఈ జాబితాలో వ్యక్తుల పేర్లు, ఖాతా నెంబర్లు సహా.. ఏ ఖాతాలో ఎంతెంత మొత్తం ఉందన్న విషయాలు కూడా వివరంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ జాబితా కాకుండా ఇంకా.. స్విస్ బ్యాంకుల ఖాతాల్లో సొమ్ము వివరాలు, ఆయా ఖాతాలు కలిగి ఉన్నవాళ్ల పేర్లు ఇంతవరకు సుప్రీంకోర్టుకు కూడా చేరలేదు. ఇంకా చెప్పాలంటే, అసలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా ఆయా పేర్లను సంపాదించిందో లేదో స్పష్టత లేదు. దుబాయ్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లోని పలు ఖాతాల్లో కూడా భారీ మొత్తంలో డబ్బు దాచుకున్నారన్న కథనాలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి వివరాలు కూడా బయటకు వస్తే.. జాబితా మరింత పెద్దది కావడం విషయం పక్కనబెడితే.. ఆ సోమ్మను భారత్ స్వాధీనంచేసుకోగలిగితే.. దేశానికి వున్న అప్పలన్నీ తీరి సిరిసంపదలు కల్గిన దేశంగా కీర్తగడించడం ఖాచం. ఇది కూడా మోడీ ప్రభుత్వ హయాంలో జరిగితే.. దేశాన్ని సుసంపన్నం చేశారన్న ఖ్యాతి కూడా దక్కుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more