దేశాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధుల్లో ఒకటిగా ఉన్న షుగర్ (మదుమేహం) పెద్దవారినే కాదు అభంశుభం తెలియని పిల్లలపై కూడా దాడి చేస్తోంది. పుట్టక ముందే చిన్నారుల శరీరంలోకి షుగర్ వ్యాధి లక్షణాలు వచ్చి చేరుతున్నాయి. తీవ్ర భయాందోళనలు కల్గిస్తున్న ఈ విషయం సీసీఎంబీ చేస్తున్న పరిశోధనల్లో వెల్లడయింది. మధుమేహంపై పరిశోధనలు జరుపుతున్న ప్రత్యేక బృందం టైప్ 2 మధుమేంపై కొత్త ఆవిష్కరణలు చేసింది. తాజా పరిశోధన ప్రకారం దేశంలో గర్బవతుల్లో హోమోసిస్టిన్ అనే ఎంజైము అధికంగా ఉత్పత్తి అయి తక్కువ బరువున్న పిల్లలు పుట్టే అవకాశం ఉంది.
ఇలా బరువు తక్కువ ఉన్న శిశువుల శరీరంలో కండరాల కంటే కొవ్వు అధికంగా ఉంటుంది. ఫలితంగా ఇది షుగర్ వ్యాధికి దారి తీస్తుందని చెప్తున్నారు. ఇక దీనికి కారణం బి-12 విటమిన్ లోపం అని సీసీఎంబీ డైరెక్టర్ మోహన్ రావు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.., దేశంలో గర్బవతులకు పోషకాహార లోపం రాకుండా ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తారు. కాని చాలావరకు బీ12ను తీసుకోరు. దీని వల్ల హోమోసిస్టిస్ అధిక మొత్తంలో ఉత్పత్తి అయి అది శిశువు శరీరంలోకి వెళ్తుందని చెప్పారు. ఫలితంగా చిన్నారులు పుట్టినపుడు బరువు తక్కువగా ఉండటంతో పాటు.. క్రమంగా బరువు పెరిగి లావుగా తయారవుతారు. అయితే వీరి కండరాల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి లావుగా మారటంతో పాటు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది.
పోషకాహార లోపం వల్లే ఇదంతా జరుగుతున్నందున.., గర్బవతులకు సరైన పోషకాహారం అందిస్తే ఈ వ్యాధిని నివారించే అవకాశం ఉందని శాస్ర్తవేత్తలు చెప్తున్నారు. గర్భిణిలకు ఫోలిక్ యాసిడ్ మాత్రలతో పాటు బీ12 మాత్రలూ ఇవ్వాలని సూచిస్తున్నారు. గర్భంతో ఉన్నపుడే కాకుండా మిగతా సమయాల్లోనూ మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే మనకు.., మన ముందు తరాలకు ఎలాంటి ఢోకా ఉండదన్నమాట.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more