మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలో తామే అత్యథఇక స్థానాలను గెలిచి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న శివసేన షాక్ కు గురైంది. ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవాలన్న ఆ పార్టీ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. ఒంటరిగానే మెజారిటీ స్థానాలను సాధిస్తామనుకున్న ఆ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. దీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీతో ఉన్న అనుబంధాన్ని సైతం తెగతెంపులు చేసుకుని తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన శివసేనకు ఆశించిన మేర ఫలితాలు రాలేదు. బీజేపితో పొత్తు పెట్టుకోకుండా బరిలోకి దిగిన శివసేన కేవలం రెండో స్థానాన్ని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల ముందుకు బీజేపితో సీట్ల కేటాయింపు విషయంలో శివసేన గట్టి పట్టుపట్టింది. తాము చెప్పినన్ని సీట్లు కేటాయించాల్సిందేని, లేకపోతే ఒంటరిగానే పోటీ చేయడానికి వెనుకాడబోమని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీలకు మధ్య సయోధ్య కుదరక పోవడంతో చివరకు బీజేపి, శివసేనలు ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాయి. ఉద్ధవ్ తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటించడంతో పాటు కేవలం తమ సంప్రదాయ ఓటింగ్నే శివసేన నమ్ముకుందని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి సాధారణ ఛాయ్ వాలా దేశ ప్రధాని అయినప్పుడు.. తాను ముఖ్యమంత్రిని కాలేనా..? అని ఆయన బీజేపినే అధికంగా టార్గెట్ చేశారు. అయినా అనుకున్న ఫలితాలు అందకపోవడంతో డీలాపడ్డారు.
ప్రధాని మోడీ మానియా ముందు శివసేన అటలు సాగలేదు. అటు బీజేపి మాత్రం మోదీ, అభివృద్ధి నినాదాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లింది. మరోపక్క కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా వేర్వేరుగా బరిలోకి దిగడం శివసేనకు కొంతమేర లాభించినా బీజేపితో పొత్తు విడిపోవడంతో మూల్యం చెల్లించుకోక తప్పలేదు. బీజేపితో పొత్తు పెట్టుకుని ఉంటే కాషాయదళ ఓట్లతో శివసేన మరిన్ని స్థానాల్లో విజయం సాధించి ఉండేది. తాజా ఫలితాలు శివసేన పార్టీకి కొంత మింగుడుపడని విషయమైనా, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపితో చేతులు కలపక తప్పదు. బీజేపి, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more