Telangana government gives assistance to andhrapradesh

telangana government, assistance, andhrapradesh government, donates, 18 crore, electric materials

telangana government gives assistance to andhrapradesh donates 18 crore electric materials

ఉత్తరాంధ్ర కన్నీళ్లను తుడిచిన తెలంగాణ..!

Posted: 10/14/2014 06:22 PM IST
Telangana government gives assistance to andhrapradesh

నిన్న మొన్నటి వరకు అది ఉమ్మడి రాష్ట్రం.. ఇప్పడు విడిపోయాం.. విడిపోయినప్పడు ఇరు ప్రాంతాల మధ్య ఎనలేని అగాధం.. ఒకరంటే మరోకరికి పడనంతగా రాగద్వేషాలు.. అన్ని వెరసి అసలు కలిసిండలేని పరిస్థితి. రెండుగా విడిపోయాం.. అయితేనేం.. రెండు తెలుగు రాష్ట్రాలే.. ఒకరికి కష్టం వస్తే మరోకరు ఆదుకుంటామన్న సంకేతాలతో తెలుగు వారి ఐక్యత విడిపోలేదని రుజువు చేస్తున్నారు. కష్టకాలంలో వున్న వారిని ఆదుకోవడం మానవత్వం అనిపించుకుంటుంది. ఇప్పడు తెలంగాణ ప్రభుత్వం చేసింది అదే. కడలి ప్రళయంతో విలవిలలాడుతున్న ఉత్తరాంధ్ర కన్నీళ్లు తుడిచింది. భాధితులను అంధకారం నుంచి బయటకు తీసుకువచ్చి.. వారిలో వెలుగులు నింపేందుకు సాయం అందించింది.

హుధుద్ తుపాను కారణంగా దెబ్బతిన్న పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తోంది. అనుకున్నదే తడవుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.18 కోట్ల విలువైన విద్యుత్ సామాగ్రిని పంపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 530 ట్రాన్స్‌ఫార్మర్లు, 28,500 విద్యుత్ స్తంభాలు, 900 కిలోమీటర్ల నిడివిగల విద్యుత్ తీగలను ఆంధ్రప్రదేశ్ కు పంపినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teachers mlc election will be conducted tomorrow
Dccb election officer traced in madanapalli  

Other Articles