తెలంగాణ ప్రభుత్వం మరోసారి వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు భారతీయులందరికి ఒకే పౌరసత్వం ఉండేది. ఇది దేశ రాజ్యాంగంలో పొందుపర్చబడింది. కాని తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది. మంగళవారం కలెక్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. త్వరలోనే తెలంగాణ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తుందని ప్రకటించారు. దీనిపై ఎన్నో ఆందోళనలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
తెలంగాణ ప్రజలందరికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామన్న కేసీఆర్.., సమగ్ర సర్వే వివరాల ఆధారంగా వీటిని అందిస్తామన్నారు. అంతేకాదు ఈ కార్డుల ద్వారానే ఇకపై సంక్షేమ పధకాలు, తెలంగాణలో ఇతర సౌకర్యాలను పొందుతారు అని ప్రకటించారు. అంటే పౌరసత్వ కార్డు ఉంటేనే ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే.. వారి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నమాట. ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి. అదేమంటే.., సమగ్ర సర్వే ఆధారంగా కార్డులు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి సర్వేలో తెలంగాణ వారితో పాటు ఇతర ప్రాంతాలనుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా పాల్గొని పేర్లు నమోదు చేయించుకున్నారు. వారికి ప్రత్యేకంగా కార్డులు ఇస్తారా.., లేక అందరికి ఒకే రకమైన కార్డులు ఇస్తారా అనేది స్పష్టంగా తెలియదు.
ప్రత్యేక పౌరసత్వ కార్డులు ఇస్తే మాత్రం... తెలంగాణలో వారికి ఇక సంక్షేమ పధకాలు పొందే అవకాశం ఉండదు అని అంతా భయపడుతున్నారు. అటు ఫాస్ట్ పధకం ప్రకారం ఫీజు చెల్లించాలంటే 1956కు ముందు నుంచి ఇక్కడ ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది అని కేసీఆర్ ప్రకటించారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది కూడా. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గే ఉద్దేశ్యంలో లేదు. మరి ఇలాంటి సందర్బంలో ప్రత్యేక పౌరసత్వ కార్డులు ఇచ్చి.. అందులో మళ్లీ తెలంగాణవారికి ప్రత్యేక కార్డులు..., సీమాంధ్రవారికి ప్రత్యేక కార్డులు ఇస్తే ఇక్కడ ఉన్న సీమాంద్ర ప్రజలు వివక్షకు గురయినవారు అవుతారు.
తాజా పరిణామాలు చూస్తే.., ఉమ్మడి రాష్ర్ట సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలు నిజం అవుతుందా అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. భవిష్యత్తులో తెలంగాణకు రావాలంటే సీమాంధ్ర ప్రజలు వీసాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అప్పట్లో వైఎస్ అన్నారు. ఇప్పుడు దాదాపు ఇదే జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఉమ్మడి రాష్ర్టంలో ఉన్న ఊరిని వదిలిపెట్టి.., ఆస్తులు అమ్ముకుని బతుకులు మార్చుకుందామని భాగ్యనగరానికి ఎంతోమంది సీమాంధ్ర ప్రజలు వచ్చారు. వారు ఇఫ్పుడు ఏపీకి చెందిన పౌరులు కాదు. అక్కడకు వెళ్ళినా వారి పిల్లలకు ఏపీ స్థానికత వర్తించదు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు అని వారిని మరింత భయపెడుతుంది. రాజ్యాంగంలో లేని నిర్ణయాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ తాజా వైఖరిపై న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more