జనసేనాధిపతి - పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్రమోడీ మధ్య వున్న సంబంధం ఎటువంటిదో అందరికీ తెలిసిందే! సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ పార్టీ పెట్టినప్పటకీ ఆయన ఎన్నికల బరిలో దిగకుండా బీజేపీ పార్టీకి తనవంతు పూర్తి మద్దతును ప్రకటించి, ఆ పార్టీ ప్రచారకర్తగా కొనసాగిన విషయం విదితమే! దేశాభివృద్ధి త్వరగా మెరుగుపడాలంటే అందుకు మోడీ అధికారంలోకి రావాల్సిందేనంటూ పవన్ ఎన్నో ప్రచారాలను కొనసాగించారు. దీంతో వీరిమధ్య చెరగని బంధం ఏర్పడింది. పవన్, మోడీకి మంచి ఆప్తుడిగా పేరు సంపాదించారు. మొత్తంగా పవన్ బీజేపీ పార్టీకి బాగానే మద్దతు పలికారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. మోడీ, పవన్ మధ్య చెడిందనే వార్తలు జోరందుకుంటున్నాయి.
అమెరికా పర్యటన అనంతరం భారత్ లో అడుగుపెట్టిన వెంటనే గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ ‘‘స్వచ్ఛ్ భారత్’’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. స్వయంగా ఆయనకూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం దేశంలో 9మంది ప్రముఖులకు ఛాలెంజ్ విసిరారు. వారిలో సినీప్రముఖులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంకచోప్రాలతోపాటు సచిన్ టెండూల్కర్, అనిల్ అంబానీ, బాబా రాందేవ్ తదితరుల పేర్లూ వున్నాయి. కానీ పవన్ కల్యాణ్ పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. మోడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో కూడా పవన్ కు ఆహ్వానం పంపలేదు. గతకొన్నిరోజుల నుంచి మోడీ కూడా పవన్ తో దూరంగానే వున్నారు. ఇటీవలే వీరిమధ్య ఎటువంటి రాజకీయ సంభాషణలు జరిగిన సందర్భాలు లేవు. దీంతో వీరిమధ్య చెడిందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీకి పూర్తి మద్దతివ్వడంలో కీలకపాత్రను పోషించిన పవన్ కల్యాణ్ ను ఇప్పుడు మోడీ ఎందుకు దూరంగా వుంచుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మోడీ ప్రధాని అయిన అనంతరం కూడా పవన్ తో సన్నిహితంగానే వుంటూ వచ్చారు కానీ.. క్రమక్రమంగా వీరిమధ్య దూరం పెరిగిపోయింది. ఏవైనా కార్యక్రమాలను నిర్వహించిన సందర్భాల్లో మొదట టీడీపీ లేదా బీజేపీ నుంచి పవన్ కు పిలుపు వచ్చేది కానీ.. స్వచ్ఛ్ భారత్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మోడీ ఎందుకు ఆహ్వానించలేదంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన ఛాలెంజ్ చేసిన వారి పేర్లలో పవన్ పేరు ఎందుకు లేదంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరి వీరిమధ్య దూరం పెరగడానికి గల కారణాలు ఏముంటాయోనని రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more