భారత్ - పాకిస్థాన్ మద్య వివాదాలు రావణకాష్టంలా రగులుతున్నాయి. దాయాది దేశం.., ఎంత చెప్పినా వినకుండా భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. పోరాడేంత సత్తా లేకపోయినా.., తుపాకులు పట్టుకుని సరిహద్దుపై విరుచుకుపడుతోంది. రెండ్రోజుల క్రితమే సరిహద్దుపై దాడి చేసి ఐదుగురిని పొట్టనబెట్టుకోగా.., తాజాగా మంగళవారం రాత్రి నుంచి కాల్పులు జరుపుతోంది. చీకటి దాడులకు అలవాటు పడిన పాకిస్థాన్.., భారత సరిహద్దులోని 63పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో సరిహద్దులో ఒక్కసారిగా యుద్ధవాతావరణం ఏర్పడింది.
కాశ్మీర్ లోని సాంబా, హీరానగర్, ఆర్ ఎస్ పురా, ఆర్నియా, ఫర్గ్ వాల్, కనాచక్ సెక్టార్లపై అయితే తుపాకులతో విరుచుకుపడింది. రాత్రి నుంచి ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పాక్ కుట్రలపై భారత జవాన్లు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. పాకిస్థాన్ కాల్పులకు ధీటుగా భారత సైన్యం సమాధానం చెప్తోంది. మన సైన్యం జరిపిన దాడిలో పాక్ కు చెందిన రెండు సైనిక స్థావరాలు ద్వంసం అయ్యాయి. తాజా కాల్పుల విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు దృవీకరించారు. పాక్ బలగాలు అర్ధరాత్రి తుపాకులు, మోర్టార్ షెల్స్ తో దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఒక భారత జవాను సహా ఐదుగురు పౌరులు గాయపడ్డారని వెల్లడించారు.
ఆదివారం జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు బలయ్యారు. ఈ కాల్పులపై రక్షణ శాఖకు సమాచారం అందిస్తామని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. భారత్ - పాకిస్థాన్ మద్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ.., దాయాది సైన్యం ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. రాత్రి సమయంలో కాల్పులు జరిపి తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తుంటారు. అయితే వీరిని భారత బలగాలు సమర్ధంగా ఎదుర్కుంటున్నాయి. భారత్ తో శాంతి కోరుకుంటున్నట్లు చెప్పే పాక్ ప్రభుత్వం.., సరిహద్దులో పాక్ ఇంతగా తెగబడుతున్నా కనీసం దీనిపై ప్రకటన కూడా చేయదు. ఇలాంటి వారిని ఏమనాలో వారే చెప్తే బాగుంటుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more