చివరికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని పాకిస్తాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేసేశారు. ముస్లిములకు వ్యతిరేకంగా మోడీ ప్రచారాలు చేసి, హిందువుల ఓట్లతో నేడు భారత ప్రధానిగా గెలిచాడంటూ అప్పట్లో ఈయనమీద పాకిస్తాన్ వాసులు తీవ్రంగా నిరసనలు చేసిన విషయం తెలిసిందే! ముస్లిములను రెచ్చగొట్టే విధంగా మోడీ వ్యవహరిస్తున్నాడని మన భారత్ లో కూడా కొంతమంది నాయకులు విమర్శలు చేసిన విషయం కూడా విదితమే కానీ ఇవి వేరే విషయాలు! కానీ మోదీని మాత్రం పాక్ ఉగ్రవాదులు పక్కాగా టార్గెట్ చేశారన్న వార్తలు మాత్రం 100 శాతం నిజమేనని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపుతున్నాయి.
భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15వ తేదీన భారత ప్రధాని మోడీని హతమార్చేందుకు పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాలు వ్యూహాలు పన్నుతున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు భారత హోం మంత్రిత్వ శాఖను అప్రమత్తం చేశాయి. మోడీ మీద నేరుగా దాడి చేసేందుకు పాక్ టెర్రరిస్టులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారని సీనియర్ ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వాతంత్ర్య వేడుకలను భగ్నం చేసేందుకు లష్కరే తోయిబా, సిమి వంటి మిలిటెంట్ గ్రూపులు ఢిల్లీలోని శివారు ప్రాంతాల్లో, వాణిజ్య సముదాయాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడే అవకాశం వుందని... ఈ నేపథ్యంలోనే ఎర్రకోట మీద కూడా దాడిచేసే అవకాశాలున్నాయని సమాచారాలు వెలువడుతున్నాయి.
అయితే ఈ దాడులను అడ్డుకునేందుకు, సదరు ముఠాల ఆచూకీ కనుక్కునేందుకు ఇంటలిజెన్స్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని అధికారులు తెలుపుతున్నారు. 26/11 తరహాలో మరోసారి విచ్చలవిడి కాల్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా పూర్తి ప్రయత్నాలు చేస్తామని అధికారులు నమ్మకాన్ని కలిగిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more