ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పై 6కోట్ల మంది ప్రజల దృష్టి ఉంది. ఆయన కోసం సీమాంద్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఆ మూడు రాత్రులు ఎక్కడ నిద్రచేస్తారా అని , ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ఆంద్రప్రజలు చకోర పక్షుల్ల ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అయినా... కొత్తగా ఏర్పడాల్సింది ఆంద్రప్రదేశ్. హైదరాబాద్ తెలంగాణకు చెందడంతో.. ఏపీకి రాజధాని ఎక్కడనేది అంతు చిక్కని సమస్యగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఏపీని సింగపూర్ లా చేస్తానన్న బాబు.. హైదరాబాద్ లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. వారానికి మూడు రోజులు ఏపీలోనే ఉంటానంటూ మాట ఇచ్చారు. గుంటూరు – విజయవాడ మధ్య ఉన్న నాగార్జున యూనివర్సిటీలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సీఎంకు అందుబాటులో ఉండేందుకు అన్ని శాఖల ముఖ్య అధికారులు మకాం ఏర్పాట్లకు సిద్ధమయ్యారు.
మే 8న లక్షలాది మంది సమక్షంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. నెలరోజులు గడిచాయి. కానీ ఇప్పటివరకు ఒక్క నిద్ర కూడా ఏపీలో చేయలేదు. సీఎం విడిది కోసం విజయవాడలో స్టేట్ గెస్ట్ హౌస్ కు 45 లక్షల ఖర్చుతో హంగులద్దారు. కానీ సీఎం ఇప్పటివరకు అక్కడకు రానే లేదు. దీంతో సీఎం మూడు రాత్రుల ముచ్చట తీరడం లేదు. మరోవైపు రాజధాని ఎక్కడో తెలియక అధికారులకు సైతం స్పష్టత రావడం లేదు.
సీఎం మూడురాత్రుల ముచ్చట తీర్చుకుంటే.. మంత్రులు, అధికారులు పరుగులు తీయడం ఖాయం. ఫైళ్లు కూడా స్పీడ్ గా కదులుతాయి. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో పని మొదలవుతుంది. రాజధాని కూడా ఎక్కడతో త్వరగా డిసైడ్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో సీఎం క్యాంపు కార్యాలయం డిసైడ్ అయి.. వారానికి మూడు రోజులు ఇక్కడే ఉంటానన్న సీఎం మాటలు ఆచరణలో పెడితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అడుగు ముందుకు పడుతుంది. మరి సీఎం గారి ఆ మూడు రాత్రుల ముచ్చట ఎప్పుడు తీరుతుందో చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more