బయట పనైపోయిన తర్వాత ఎక్కడికి తిరిగిపోవాలో తెలియకపోతే ఆ రాజు ఏం పనిచెయ్యగలడు. సభలు తీర్చటానికి, విధివిధానాలను నిర్ణయించటానికి రాజధాని చాలా అవసరం. రాచరికం అంతరించి ప్రజాస్వామ్యం వచ్చినా, ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులైనా కార్యక్రమాలను నిర్వహించాలంటే అందుకు ఒ స్థలం కావాలి కదా. దాన్నే ఇప్పటికీ రాజులు అంతరించినా ఇంకా రాజధాని అనే అంటున్నాం. భాషలో ఏ పేరుతో వ్యవహరిస్తేనేంలే కానీ రాష్ట్రానికి సంబంధించిన పాలన యంత్రాంగాన్ని నడిపించటానికి ఒక కేంద్రం కావాలి కదా. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇదమిద్ధమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు.
విజయవాడ గుంటూరు మధ్యలోఅని ఊగిసలాడిన రాజధాని కాసేపు అమరావతి వైపు మళ్ళింది. నిర్ణయం ఎందుకు జరగటం లేదు అంటే ముందుగా భూసేకరణ జరగాల్సి వుంది. అందుకు ఇబ్బందులున్నచోట రాజధాని నిర్మాణం జరగటం కష్టం.
రాష్ట్ర మంత్రి కెఇ కృష్ణమూర్తి రాజధాని విషయంలో మాట్లాడుతూ, ఇంతవరకు అధికారికంగా ఏ నిర్ణయమూ జరగలేదని, కేవలం కొన్ని ప్రతిపాదనలు, ఆలోచనలు మాత్రమే బయటకు వస్తున్నాయని అన్నారు. రాజధానికి కావలసినంత స్థలం కూడా ఒకే చోట లభించే అవకాశం లేకపోవటం కూడా ఒక అడ్డంకే అవుతోందని మంత్రి అన్నారు.
రాజధాని ఎక్కడన్నది నిర్ణయించటానికి కాంగ్రెస్ హయాంలో ఏర్పడ్డ కమిటీ కూడా వివిధ ప్రాంతాలను పరిశీలించింది కానీ నివేదికలో ఏదీ స్పష్టంగా తెలపలేకపోయిందని తెలుస్తోంది.
అసలు ప్రస్తుతమున్న నగరాలలో ఏ నగరాన్నీ కాకుండా కొత్తగా ఏదైనా అటవీ ప్రాంతాన్ని ఎన్నుకున్నా కూడా దాన్ని డీఫారెస్టేషన్ కి అనుమతిస్తామని గత కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ సూచన కూడా చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు రాజధాని విషయంలో ఎన్నో రకాల ప్రతిపాదనలున్నాయి. వాటిలో ఏది ఎక్కువ అనుకూలమని నిర్ణయిస్తారో వేచి చూడాల్సివుంది. అన్నిటికన్నా రాజధాని నిర్ణయంలో ఎక్కువగా భూసేకరణే ఎక్కువ అడ్డంకులను కలిగిస్తోందని మంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more