ఆంద్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మద్య పవర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి దీటుగా.. తెలంగాణ గవర్నర్ పావులు కదుపుతుంది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పై తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు పై ప్రతీకార చర్యగా.. తెలంగాణ ప్రభుత్వం.. తెరపైకి మరొ కొత్త వివాదం తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను సింగరేణి నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనివల్ల సుమారు 1200-1300 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం కడప, విజయవాడ ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా నిలిచిపోయిందని సమాచారం. పీపీఏ రద్దుకు ప్రతిచర్యగా అనే అనుమానం వ్యక్తమౌతోంది.ఇటీవల పీపీఏలను రద్దు చేయాలని ఏపీ జెన్ కో కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఆర్సీకి లేఖ రాసింది. దీనిని ఈఆర్సీ తిరస్కరించింది. పీపీఏలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినందున రెండు రాష్ట్రాల డిస్కంలు కలిసి కోరితేనే రద్దు చేస్తామని స్పష్టం చేసింది. కానీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోని నాలుగు జెన్ కోలకు ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది. లేఖ ప్రతిని ఈఆర్సీకి సమర్పించింది.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేగేసి చెబుతోంది. తమ మధ్య చేసుకున్న ఒప్పందాలు విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెన్ కో లేఖలో స్పష్టంగా పేర్కొంది. తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ కేటాయిస్తే.. ఆంధ్రప్రదేశ్కు 46.11 శాతం విద్యుత్తును కేటాయించింది. దీంతో విద్యుత్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది.
ఈ నేపథ్యంలోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రెగ్యులేటరీ కమిషన్ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. 2009లో సమర్పించిన ఒప్పందాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. నిజానికి ఈ ఒప్పందాలను కమిషన్ ఆమోదించలేదు. 2009లో సమర్పించిన ఒప్పందాలను కమిషన్ ఆమోదించకపోయినప్పటికీ, ఆ ఒప్పందాల ఆధారంగానే విద్యుత్ పంపిణీ, కొనుగోలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల మద్య ముదురుతున్న వివాదం ఎప్పుడు చల్లబడుతుందో చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more