తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు ఈ రోజు సీమాంద్ర లోని అనంతపురం జిల్లా కోర్టు నుండి నోటీసులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసిఆర్ .. తెలంగాణ అభివృద్ది దృష్టి పెట్టి, చాలా బిజీగా ఉన్నారు.
అయితే ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ..ఒక్కరి పైఒకరు విమర్శలు చేసుకోవటం సహజంగా జరుగుతుంది. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం రాజకీయ నాయకులు మరి శృతిమించి నోటి దూల తీర్చుకున్నారు. రాజకీయ భాషను వదిలి. తిట్ల పురణాం చదువుకున్నారు. తెలంగాణ గడ్డపై.. తెలివిగా, అందరికి నచ్చే విధంగా తన రాజకీయ ప్రత్యర్థిపై తిట్లు తిట్టడం సీఎం కేసిఆర్ వెన్నతో పెట్టిన విద్య. ఎంతైన..ఆయన సాహిత్యంలో చాలా ప్రావీణ్యం సంపాదించిన నేత ఒక్క కేసిఆరే అని రాజకీయ మేథావులు చెబుతున్నారు.
అయితే అలాంటి రాజకీయ మేథావికే.. అప్పడప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. ‘‘వసుదేవుడు అంతటి వాడే.. గాడిత కాళ్లు పట్టుకున్నట్లు చరిత్ర చెబుతుంది’’, అలాంటిది కేసిఆర్ కు కోర్టు నోటీసులు చాలా సహజమే అని ..ఆయన అభిమానులు అంటున్నారు. ఇప్పుడు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ పవన్ కళ్యాణ్ , కేసిఆర్ల మద్య .. చిన్న పాటి మాటల రాజకీయ యుద్దం నడిచిన విషయం తెలిసిందే. అదీ కూడా ఎన్నికల సమయంలో జరిగింది కాబట్టి ఆ మాటల వార్ గురించి పెద్దగా పట్టించుకోలేదు గానీ, తెలుగు ప్రజలు ఎవరు ఆ విషయాన్ని మరిచిపోలేదు.
ఇప్పుడు ఆ పవర్ పుల్ మాటల పవర్ ఇప్పుడు బయట పడింది. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనంతపురం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. మురళీ కృష్ణ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నోటీసులు అందుకున్న సీఎం కేసిఆర్ ఈనెల 30న కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more