ఇరాక్ సిరియా దేశాల ఎల్లలను లెక్కచెయ్యకుండా ఆ రెండు దేశాలను కలిపి తనదైన ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించుకునే యత్నంలో ఉన్న ఐఎస్ఐఎస్ ని తరిమికొట్టటానికి, అమెరికాని వైమానిక దళం ద్వారా దాడి చెయ్యమని ఇరాక్ ప్రభుత్వం కోరింది. సున్ని ముస్లింలైన ఐఎస్ఐఎస్ సేనకి ఉగ్రవాద అల్ ఖ్వేదా మద్దతుంది. ఇరాక్ నుంచి ఉత్తర సిరియా వరకు ఐఎస్ఐఎస్ తన రాజ్యాన్ని స్థాపించుకునే దిశగా ఆ దేశాల్లో దాడులు చేసి కొన్ని స్థావరాలను కైవసం చేసుకుంది. ఇంతవరకు 1700 మంది షియాలను అంతమొందించామని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. ఇరాక్ లో ప్రాణ భయంతో సామాన్య ప్రజానీకమే కాకుండా సెక్యూరిటీకి చెందిన సీనియర్ అధికారులు కూడా పారిపోయారు.
ఇరాక్ ప్రధానమంత్రి నౌరి అల్ మలికి అమెరికా అధ్యక్షుడు ఒబామాని ఇరాక్ లో సంక్షోభం సృష్టిస్తున్న అల్ ఖ్వేదా ప్రోత్సాహంతో దాడులు చేస్తున్న ఐఎస్ఐఎస్ సైన్యాలను అదుపు చెయ్యటానికి వాళ్ళ మీద వైమానిక దాడి చెయ్యవలసిందిగా కోరారు. బుధవారం మధ్యాహ్నం ఎఫ్-18 ఫైటర్ జెట్ లు ఇరాక్ లో పరిస్థితిని గమనించటానికి వెళ్ళాయి. పైలట్లు ఉన్నవి కానీ లేక మానవ రహిత విమానాలను ఇరాక్ మీద పరిశీలనకు వెళ్ళటానికి అమెరికా ప్రభుత్వం అనుమతించింది. అయితే ఎఫ్-18 లు యుద్ధ విమానాలే కానీ నిఘా పరిశీలనలకు ఉపయోగించేవి కావు.
ఇరాక్ లో ఉన్న పరిస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకోవటానికి, ఒబామా తనకి కాంగ్రెషనల్ నాయకుల అనుమతి తీసుకునే అవసరం లేదని అన్నారు. అయితే ఒబామా నేల మీద కాకుండా విమానాల ద్వారా పైనుంచి ఐఎస్ఐఎస్ మీద దాడి చెయ్యటమే జరుగుతుందని అన్నారు.
దానికి ప్రతిగా సర్క్యులేషన్ లో ఉన్న ఒక వీడియా ద్వారా, అమెరికాకు చెందిన ప్రపంచంలోని అన్ని ఎంబసీల మీదా దాడి చెయ్యమని మొరాకోకి చెందిన సున్ని మతాధికారి షేక్ మొహమద్ అలి అల్గజౌలీ ఆన్ లైన్ లో పిలుపునిచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more