మరణం అంచువరకు వెళ్లి వచ్చిన అమ్మాయిని కాపాడింది.. ఆమె కెమెరానే. ఒకరు కాదు.. ఇద్దరు ..ఏకంగా 24 మంది తెలుగునేల తల్లి బంగారు బిడ్డల .. భవిష్యత్తును.. హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది మింగేసింది. వారి కన్నతల్లిదండ్రులకు ..తీరాని శోకం మిగిల్చింది.ఎదుగుతున్న తమ బిడ్డలను చూసుకొని మరిచిపోయే తల్లిదండ్రులను శోక సముంద్రలో ముంచింది ..విహార యాత్ర. జరిగిన ప్రమాదం నుండి బయటపడిన వారు ఆ క్షణాలు తలచుకొని గజగజ వణికిపోతున్నారు.
తన తొటి మిత్రులు .. కళ్ల ముందే ప్రమాదంలో చిక్కుకొని, చేసిన ఆర్తనాధాలు విని కాపాడలేకపోయమే అనే బాధలో కుమిలిపోతున్నారు. హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నది వద్ద జరిగిన ప్రమాదం నుంచి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామానికి చెందిన సద్ది దివ్య త్రుటిలో బయటపడింది.
అక్కడ జరిగిన విషయాన్ని చెబుతున్న దివ్య మాటలు.. హిమాచల్ప్రదేశ్లోని కులూ ప్రాంతానికి చేరుకున్నాం. 52 మందిలో 38 మంది బస్సు దిగాం. ఆడుకుంటూ రాళ్లపై కూర్చుని ఫొటోలు దిగుతున్నాం. అందరం గ్రూపు ఫొటో దిగాలని నది మధ్యలోకి వెళ్లి నిల్చున్నాం. మాలో ఒకరైన అఖిల్ అనే విద్యార్థి ఫొటోలు తీస్తున్నాడు.
గ్రూపు ఫొటోను నా కెమెరాలోనూ తీయాలని చెప్పేందుకు నా వద్ద ఉన్న కెమెరా ఇచ్చేందుకు అఖిల్ వద్ద వెళ్లా. అంతలోనే నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువైంది. నా వద్దకు కూడా వరద ఉధృతి వస్తున్న సమయంలోనే ఓ విద్యార్థి పక్కకు లాగారు.దీంతో ప్రవాహం బారినుంచి త్రుటిలో తప్పుకున్నా. ‘నా ప్రాణం కాపాడింది.. కెమెరానే ’ అంటూ రోదిస్తూ చెప్పింది. ‘బియాస్ నదిపై ఉన్న డ్యాం నుంచి నీళ్లు వదిలిన విషయం తమకెవరికీ తెలియదని దివ్య వెల్లడించింది.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more