టిడిఎస్ అంటే 'టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్' అని మధ్యతరగతి వారికి, జీతాల మీద బ్రతికేవారికి, వృత్తి వ్యాపారాలలో ఉన్నవారందరికీ తెలుసు. ఆదాయ పన్ను ముందస్తు చెల్లింపు విధానమిది.
ఇది ఆదాయ పన్ను శాఖకు చెందింది. ప్రజలు పన్ను చెల్లించకపోతే ప్రభుత్వం నడవదన్నది నిజం! అందులో ఆదాయ పన్ను ప్రభుత్వానికి ప్రముఖమైన ఆదాయ వనరు కాబట్టి ఆ విషయంలో దయా దాక్షిణ్యాలు చూపించకుండా ముక్కు పిండి వసూలు చెయ్యాలన్న ధోరణిలోనే భారత దేశంలో ఇంతవరకూ జరుగుతూ వస్తోంది. అందుకే ఆ శాఖకు విస్తృతమైన అధికారాలను కూడా ప్రభుత్వం కట్టబెట్టింది.
తీరా టిఫిన్ తిన్న తర్వాత డబ్బులు లేవని కస్టమర్ చెప్తే? అనుకుని రెస్టారెంట్ లో కావలసిన పదార్థాలకు ముందుగానే చెల్లించి టోకెన్ తీసుకుని టిఫిన్ తీసుకునే పద్దతిలో, సంవత్సరమంతా అయిపోయిన తర్వాత మీరు ఆర్జించిన ఆదాయంలో ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సింది చెల్లిస్తారో లేదో. అందువలన దాన్ని ముందుగానే వసూలు చేసే పనిని ఆదాయపన్ను శాఖ చెల్లింపులు చేసే వారి భుజాల మీద పెట్టింది. జీతం కానీ, కాంట్రాక్ట్ పని కానీ, వృత్తికి సంబంధించిన చెల్లింపులు కానీ ఇలాంటి ఇతరులకు ఆదాయాన్ని కలిగించే చెల్లింపులు చేసే సమయంలో ఆ చెల్లించేవారే ముందుగా తాము చెల్లించే సొమ్ములోంచి నిర్దిష్టమైన శాతం టిడిఎస్ రూపంలో తగ్గించి అవతలివారి చేతిలో పెడతారు.
"లేదు, నాకంత ఆదాయం లేదు నేను పన్ను చెల్లించ వలసిన పని లేదు" అని నెత్తి నోరు కొట్టుకుని మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఆ సొమ్మును తగ్గించి చెల్లించమని ఆదేశించింది కాబట్టి వాళ్ళకి ఆ పని చెయ్యక తప్పదు. ఆ పని చెయ్యకపోతే వాళ్ళు ఆదాయ పన్ను శాఖ నియమాన్ని అతిక్రమించినట్లు! అందుకు జరిమానాలు కూడా ఉంటాయి. అంతేకాదు అలా తగ్గించిన సొమ్మును వాళ్ళు ఠంచన్ గా ఆదాయ పన్ను శాఖకు చెల్లించవలసివుంటుంది. అలా ఆదాయ పన్ను శాఖ తరఫున చేసిన మినహాయింపు సొమ్ము బాపతు సర్టిఫికేట్ ను కూడా వాళ్ళు చెల్లింపులు చేసినవారికి ఇవ్వవలసి ఉంటుంది.
ఇక అలా బలవంతంగా టిడిఎస్ రూపంలో తమ ఆదాయంలో గండి పడినవారు సంవత్సరాంతంలో ఆదాయ పన్ను శాఖకు రిటర్న్ ఫైల్ చేస్తూ, అందులో తమ ఆదాయమెంత, ఖర్చెంత, నికరాదాయం మీద పన్ను ఎంత, అందులో టిడిఎస్ రూపంలో అప్పటికే ఎంత చెల్లించివున్నారన్న వివరాలను పొందుపరచి, టిడిఎస్ రూపంలో ఎక్కువ చెల్లించినట్లయితే దాన్ని తిరిగి ఇవ్వమని ఆదాయపన్ను శాఖను కోరుకోవలసివుంటుంది.
అలా రిఫండ్ అడిగినవారిలో వారి మొత్తం సొమ్ము రానివారే అధిక సంఖ్యలో ఉంటారు. అలా టిడిఎస్ ని తిరిగి పొందటానికి అర్జీలు పెట్టుకునేవారికి తమ ఆదాయానికి గండికొట్టే పెద్ద పెనుభూతంలా కనిపిస్తోంది టిడిఎస్!
పన్నులను వసూలు చేసుకోవటం ప్రభుత్వం చెయ్యవలసిన పని. వోటేసిన పాపానికి ప్రజలమీద ఆ పని భారాన్ని కొంత మోపటం ఎంతవరకు సబబు? ప్రభుత్వం తరఫున ప్రజలు జీతం భత్యం లేకుండా చేసే వెట్టిచాకిరే ఈ టిడిఎస్ డిడక్ట్ చేసి దాన్ని ఆదాయ పన్ను శాఖకు చెల్లించటం!
పన్నులలో సవరణలకు టాక్స్ పేయర్ అన్ని టేబుళ్ళ దగ్గరకూ పోవలసివుంటుంది. ఎవరికి వారు వారి పని కాదని, అది ఎవరికి చెందింది, లేదా ఆన్ లైన్ ఫిల్ చేసిన ఫారాలైతే దాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ కి పంపించటం చేస్తుంటారు. దాని కోసం పడే వెతలు, అందులో అయ్యే ఖర్చుకంటే దాన్ని వదులుకోవటమే లాభసాటి బేరంలా కనిపిస్తుంది పన్ను చెల్లించిన వ్యక్తికి.
ఆదాయ పన్ను శాఖతో సంబంధమున్న ఛార్టర్డ్ ఎకౌంటెంట్స్ చేసే పనేమిటన్నది ఎంత తక్కువ తరిచి చూస్తే అంత మంచిది! వాళ్ళు చదువుకున్న దానితో చేసేపనికి పొంతన వుండదు. రిటర్న్ ఫైల్ చేయటానికి రిఫండ్ తెచ్చి పెట్టటానికి వాళ్ళలో చాలామంది చేసేది న్యాయపోరాటం కాదు. ఈ పనికి ఇంత, ఆ పనికి అంత అని సంబంధితి అధికారులతో మాట్లాడుకోవటమే!
సెంట్రల్ ప్రాసెసంగ్ సెంటర్ అనేది హృదయం లేని ఒక ఎలక్ట్రానిక్ వ్యవస్థ. దానికి చెప్పుకోవటమంటే మళ్ళీ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ని పంపటమే. మానవసిబ్బంది నడిపే హెల్ప్ లైన్లా పనిచెయ్యవెప్పుడూ! ఇంత పన్ను రావాలి, రాలేదు, అందుకు మేము ఇంత అదనపు పన్నును చెల్లించవలసిందిగా కోరుతున్నామంటూ నోటీసులు మాత్రం ఠంచన్ గా వచ్చేస్తుంటాయి. ఒక డిపార్ట్ మెంట్ సోయి మరోదానికి ఉండదు. ఇది మా పని కాదు అని చేతులు దులిపేసుకోవటం వాళ్ళకి వెన్నతో కాకపోయినా అప్పాయింట్ అయిన మొదటి రోజులనుంచే సంక్రమించిన విద్య.
టాక్స్ పే చేసేవారు ప్రభుత్వ ఆదాయానికి దోహదం చేసేవారు. వాళ్ళు ఆదాయ పన్ను శాఖకు కస్టమర్లు. వారిని కస్టమర్లుగా చూడాలి కానీ ప్రతివారూ దొంగలుగా, న్యాయంగా శాఖకు ముట్టవలసిన సొమ్మును హరించే మోసగాళ్ళుగా చూడగూడదు! కానీ డబ్బు చెల్లిస్తూ కూడా ఆదాయ పన్ను చెల్లించేవారు సముచిత గౌరవాన్ని పొందరు. సరిగ్గా చెల్లిస్తే వాళ్ళు తమ బాధ్యతను నెరవేర్చినట్లు, చెల్లించకపోతే దేశానికి ద్రోహం చేసినట్లుగా చూస్తారు.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ జైట్లీ ఈ విషయంలో ఆలోచించి టిడిఎస్ ని ఎత్తివేయగలిగితే అది ఎందరికో ప్రయాజనకారి అవుతుంది. ప్రభుత్వం పట్ల గౌరవం నమ్మకం వృద్ధి అవుతాయి.
రాజకీయంగా చూసినా అధిక సంఖ్యాకులైన మధ్యతరగతి వారు, చిన్న చిన్న వ్యాపారులు తమ ఇబ్బందులను తొలగించిన ప్రభుత్వానికి కృతజ్ఞతగా మరోసారి గెలిపిస్తారన్నది ఖాయం! అలా మధ్యతరగతి వారి ఇబ్బందులను అర్థం చేసుకోకుండా, వ్యాపారస్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది. అది ఒక కారణమైయ్యుండవచ్చు కానీ అదీ కారణమే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more