తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసిఆర్ సాక్షిగా.. సచివాలయంలో ఆంద్ర ఉగ్యోగులు, తెలంగాణ ఉద్యోగుల మద్య ఫైటింగ్ జరిగింది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల నేత పద్మాచారి ముందుగా కేసీఆర్ నిలువెత్తు ఫొటో తీసుకుని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఉద్యోగుల కార్యాలయానికి వచ్చారు.
సచివాలయంలో ఎన్నాళ్లుగానో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం కార్యాలయాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు ప్రకటించడం ఈ వివాదానికి కారణమైంది. ఈ కార్యాలయాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నామని పద్మాచారి ప్రకటించారు.
దీనికి అక్కడే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కేటాయించిన ఈ కార్యాలయాన్ని మీరెలా తీసుకుంటారని వారు అడ్డుకున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘానికి మాత్రమే గుర్తింపు ఉంది. అందుకోసం వారి సంఘానికి సచివాలయ ప్రాంగణంలో ఓ కార్యాలయం కేటాయించడమే కాక, దాని నిర్వహణకు నిధులను కూడా ప్రభుత్వమే ఇస్తోంది.
తెలంగాణ ఉద్యోగులకంటూ ప్రత్యేకంగా కార్యాలయం లేదు. దీంతో ఇప్పుడున్న కార్యాలయాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు పద్మాచారి ప్రకటించి, అక్కడ కేసీఆర్ నిలువెత్తు ఫొటో తగిలించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు మురళీ కృష్ణ తదితరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, వాదులాట చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో సచివాలయంలోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more