వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలవరం దెబ్బ తాకింది. పోలవరం ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తూ తెలంగాణలో బంద్ పాటించిన విషయం తెలిసిందే. అయితే ఈ బంద్ ఇప్పుడు జగన్ పెద్ద పెను సమస్యగా మారింది. ఇక తెలంగాణలో వైఎస్ జగన్ కొత్త సవాళ్లను ఎదుర్కుకోవాల్సి న అవసరం ఉంది. ఖమ్మం జిల్లా సాక్షిగా.. జగన్ పార్టీకి కొత్త కష్టాలు వచ్చాయి.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎంపీ ఉన్న ఆ పార్టీకి కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో రగడ అంతా ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్పైనే కొనసాగుతోంది. ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలు ఖమ్మం జిల్లాలో ఆందోళన చేస్తున్నాయి.
ఇదే సందర్భంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్ని బంద్ ను చేపట్టాయి. కాని ఖమ్మంలోనే బలమైన పార్టీగా అవతరించిన వైసీపీ మాత్రం ఈ అంశంలో సీమాంధ్రనే సమర్థించాల్సి రావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇప్పటికి వైసీపీ రెండు రాష్ట్రాల్లోనూ ఒకే కమిటీ కింద పనిచేస్తోంది. రెండు ప్రాంతాల్లో ఏ సమస్య వచ్చినా ఒకరి చేతే మాట్లాడించాల్సిన పరిస్థితి ఉంది.
దీంతో తెలంగాణ సమస్యలపై ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేని సంకట స్ధితిని ఎదుర్కోవాల్సి వస్తోంది.అసలే ఎన్నికల్లో ప్రజలు పెట్టిన వాతలకు ఇంక మందు రాస్తున్న సమయంలో.. పోలవరం దెబ్బ పడేసరికి.. జగన్ పార్టీ నేతలు అల్లాడిపోతున్నారు.
దీంతో ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నప్పటికి .. పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల వైపు ఉండకపోవటంతో.. అక్కడ ..జగన్ పార్టీకి కొత్త కష్టాలను కొన్ని తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై జగన్ ఏం చెబుతారో చూద్దాం. ‘‘ ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి? ఇప్పుడు జగన్ పార్టీ నేతలు ఎలా బయట పడతారో చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more