నరేంద్ర మోదీ కేబినెట్ ల పట్టణాభివృద్ధి శాఖకు మంత్రిత్వ అధికారాలను చేపట్టిన వెంకయ్యనాయుడు 2005 లో యుపిఏ ప్రభుత్వం స్థాపించిన జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ను రద్దు చెయ్యటానికి సంకల్పించుకున్నారు.
2012 లో అయిపోయిన ఈ మిషన్ మరో రెండు సంవత్సరాలకు పొడిగించబడింది. ఈ మిషన్ రెండవ దశకు కేబినెట్ నోట్ తయారైనా, దాని స్థానంలో మరో కార్యక్రమాన్ని రూపొందించబోతున్నామని వెంకయ్య నాయుడు అన్నారు. రాబోయ్ మిషన్ లో పట్టణాభివృద్ధిలో విశాలంగా చెయ్యటం, నగరంలోని వృధా నీరు, చెత్త మేనేజ్ మెంట్, ప్రజా రవాణా లాంటివి ఉంటాయని ఆయన అంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబాల పేర్లు కూడా దేశంలో కనిపించకుండా దేశవాసులు పూర్తిగా వాళ్ళని మర్చిపోయేట్టుగా చేసే ప్రయత్నమని అప్పుడే దీని మీద విమర్శలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ అనే పేరుని మారిస్తే ఊరుకునేది లేదని కొందరు కాంగ్రెస్ నాయకులంటున్నారు.
మరోపక్క వెంకయ్య నాయుడు 100 స్మార్ట్ సిటీలను నిర్మించి అందులో తక్కువ వడ్డీ రేటుకి గృహ ఋణాలు ఇస్తామంటున్నారు. అందరికీ ఇళ్లు అన్నది ప్రధానంగా పెట్టుకున్న ఆశయమని, 2020 నాటికి దాన్ని సాధిస్తామని అంటున్నారు. అంటే, 2019 ఎన్నికల సమయానికి ఆ పని పూర్తికాకపోయినా ఎన్నికల ప్రచారానికది అడ్డురాదు అని కూడా కొందరు నాయకులు అంటున్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వాళ్ళతో పాటు మున్సిపల్, ఎల్ఐసి, బ్యాంక్, రైల్వే ఉద్యోగులకు గృహాలను సమకూర్చవలసిన బాధ్యత ఆయా రంగాలకు ఉందని వెంకయ్య నాయుడు అన్నారు.
ఈ ప్రోజెక్ట్ లకు అర్బన్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే 32819 కోట్ల రూపాయల నిదులను కేటాయించింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more