టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమై... పలు సమస్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా విభజనతో ముడిపడిన సమస్యలపై ఆయన దృష్టి సారించనున్నారు.
బాబు ముందు ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, 11 గంటలకు జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, 12.30 గంటలకు ప్రణాళిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, మధ్యాహ్నం 2 గంటలకు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, 3.00 గంటలకు ప్రణాళిక సంఘం సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి లతో సమావేశమవుతారు.
ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ఆయన భేటీ అవుతారు. . ఇక సాయంత్రం 6 గంటలకు విద్యుత్ శాఖ మంత్రితో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి పెండింగులో ఉన్న కీలకమైన అంశాలను వారితో చంద్రబాబు చర్చిస్తారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more